
కరీంనగర్ :
గంజాయి ముఠాను కరీంనగర్ రూరల్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. వివరాలను ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. సిపి ఆదేశానుసారం ఏ. లక్ష్మా రెడ్డి , యస్. ఐ తన కానిస్టేబుల్, మహిళ సంయుక్తంగా గుంటూరుపల్లి , బొమ్మకల్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు గంజాయి తో పట్టుబట్టారని చెప్పారు. ఈ ముఠాలో దుర్శేడ్ గ్రామానికి చెందిన నేరెళ్ల చరణ్ తండ్రి రాజు, గోపాల్ పూర్ గ్రామానికి చెందిన బెజ్జంకి లోకేష్ తండ్రి శ్రీనివాస్, మైనర్ బాలుడు కలిసి గంజాయితో తమ యమహా మోటార్ సైకిల్ పై వస్తూ పోలీస్ వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకొని చూడగా మోటార్ సైకిల్ పై ఉన్న కవర్లో గంజాయి లభించింది. అనంతరం విచారణ చేపట్టగా పై ముగ్గురు వ్యక్తులు పరిచయస్తులు, స్నేహితులు. చదువులు మధ్యలోనే మానివేసి జల్సాలకు అలవాటుపడి, అదే క్రమములో అవసరాలను తీర్చుకొనుటకు గంజాయి ని మరో వ్యక్తి నుండి కొనుకొని వచ్చి కరీంనగర్ లోని చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో అమ్ముతూ గత కొంత లాభాలు పొందుతున్నారు. ఇదే క్రమములో ముగ్గురు వ్యక్తులు మరో వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి కొంత అధిక లాభాలకు అమ్మినారు. మరికొంత శుక్రవారం అమ్ముటకు వెళుతుండగా పోలీస్ లు పట్టుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి గంజాయి 260 గ్రాములు , ఒక యమహా మోటార్ సైకిల్ , కొంత నగదు మరియు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోనైనది. యువత చెడు అలవాటులకు బానిసలూ కావద్దని , జీవితాలను నష్టపరుచుకోవద్దని తెలుపడం జరిగింది. ఎవరైనా గంజాయి అమ్ముతూ పట్టుబడితే వారిని జైలు కు పంపడం తో పాటు, వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి, ఇంకా మారకపోతే వారిపై PD ఆక్ట్ కూడా పెట్టుతామని ఇన్స్పెక్టర్ గారు హేంచరించడం జరిగింది. ముఠాను పట్టుకోవడంలో పాల్గొన్న ఎస్ఐ లక్ష్మారెడ్డి కానిస్టేబుళ్లను, మహిళా సిబ్బందిని కరీంనగర్ రూరల్ ఎసిపి విజయకుమార్ అభినందించడం జరిగిందన్నారు.