ఎమ్మెల్యే జిఎంఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన పెన్నార్ బిఆర్టియు నాయకులు..
పెన్నార్ కార్మిక లోకానికి సంపూర్ణ మద్దతు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు:
శనివారం జరిగిన పెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో తమ హ్యాట్రిక్ విజయానికి సంపూర్ణ సహకారం అందించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి బి ఆర్ టి యు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆదివారం పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్చం అందించి.. మిఠాయిలు తినిపించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు, పెన్నార్ పరిశ్రమ అధ్యక్షులు రాంబాబు యాదవ్, మాజీ ఎంపీపీ, పెన్నార్ పరిశ్రమ కార్యనిర్వాహక అధ్యక్షులు యాదగిరి యాదవ్, కార్మిక నాయకులు పాల్గొన్నారు.
About The Author
22 Jun 2026
