ఎమ్మెల్యే జిఎంఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన పెన్నార్ బిఆర్టియు నాయకులు..

పెన్నార్ కార్మిక లోకానికి సంపూర్ణ మద్దతు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎమ్మెల్యే జిఎంఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన పెన్నార్ బిఆర్టియు నాయకులు..

పటాన్‌చెరు: 

శనివారం జరిగిన పెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో తమ హ్యాట్రిక్ విజయానికి సంపూర్ణ సహకారం అందించిన పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి బి ఆర్ టి యు   నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

 ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్చం అందించి.. మిఠాయిలు తినిపించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. గత మూడు పర్యాయాలుగా బి ఆర్ టి యు నాయకత్వాన్ని బలపరిచి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన పెన్నార్ పరిశ్రమ కార్మికులకు అభినందనలు తెలిపారు. కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కార్మిక నాయకులకు సూచించారు. తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని.. కార్మికుల భవిష్యత్తుకు ఎల్లప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో బి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు, పెన్నార్ పరిశ్రమ అధ్యక్షులు రాంబాబు యాదవ్, మాజీ ఎంపీపీ, పెన్నార్ పరిశ్రమ కార్యనిర్వాహక అధ్యక్షులు  యాదగిరి యాదవ్, కార్మిక నాయకులు పాల్గొన్నారు.

About The Author