శ్రీ సాయి నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి..

పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

శ్రీ సాయి నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి..

రామచంద్రాపురం:

రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీ సాయి నగర్ కాలనీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు  గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. 

ఆదివారం సాయంత్రం కాలనీలో పర్యటించి.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. 

ప్రధానంగా అమ్మవారి దేవాలయం, కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలాల అంశంలో వివాదాల నేపథ్యంలో నిర్మాణాలు ఆగిపోయాయని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. త్వరలోనే సంబంధిత వ్యక్తులతో పాటు ప్రభుత్వ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, సీనియర్ నాయకులు పరమేష్, ఐలేష్, ప్రమోద్ గౌడ్, కాలనీ అధ్యక్షులు వీర్ శెట్టి, మాజీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.

About The Author