ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తి కలిగి ఉండాలి

- మాదిరి పృథ్వీరాజ్

WhatsApp Image 2025-10-26 at 7.14.49 PM

సంగారెడ్డి : 
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి ప్రిథ్వీరాజ్  ప్రజలతో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు.పట్టణంలోని గౌతమ్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కాళికామాత మండపాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకుని పూజా కార్యక్రమంలో పాల్గొని, స్థానిక నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడిన ఆయన, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సానుకూలతను పెంపొందిస్తాయని అన్నారు.పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన మహమ్మద్ ఆదిల్ అహ్మద్ వివాహ విందు కార్యక్రమంలో లియాకత్ తో కలిసి పాల్గొని ఆశీర్వదించారు.

Read More అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

About The Author