రెడ్డి బ్రదర్స్ లైన్ లో రోడ్ల అక్రమణల తొలగింపు
ఎల్బీనగర్:
సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ ఆదేశానుసారం టౌన్ ప్లానింగ్ అధికారులు శుక్రవారం గడ్డిఅన్నారం డివిజన్ కోదండరాం నగర్ కాలనీలోని రెడ్డి బ్రదర్స్ వీధిలో రోడ్లు ఆక్రమణలు తొలగించారు. మొత్తం 26 చోట్ల రోడ్లు పూర్తిగా అక్రమణకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటిని గుర్తించి పూర్తిగా తొలగించినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో టిపిఎస్ సాయి అర్చన, న్యాక్ ఇంజినీర్ సురేష్, రాము, సాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
About The Author
25 Apr 2026
