పారదర్శకతతో సంక్షేమ పథకాల అమలు..

  • అభివృద్ధి..సంక్షేమమే మా తొలి ప్రాధాన్యత..
  • పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 
  • 226 మంది లబ్ధిదారులకు రెండు కోట్ల 26 లక్షల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి..షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

పారదర్శకతతో సంక్షేమ పథకాల అమలు..

పటాన్‌చెరు:

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల అందిస్తూ పూర్తి పారదర్శక పాలన అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 

మంగళవారం పటాన్‌చెరు లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. రామచంద్రాపురం, పటాన్చెరు, అమీన్‌పూర్ రెవెన్యూ మండలాల పరిధిలోని 226 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. WhatsApp Image 2026-05-05 at 19.10.04

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న సమన్నత లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని విప్లవాత్మక పథకాన్ని పెట్టారని గుర్తు చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రజల ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు తెలిపారు.. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-05-05 at 19.10.04 (2)

About The Author