అభివృద్ధి పనుల్లో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలి..
- పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- గుమ్మడిదల మున్సిపల్ కార్యాలయం అదనపు అంతస్తులు, పశువుల ఆసుపత్రి అదనపు గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన..
గుమ్మడిదల:
గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
గురువారం గుమ్మడిదల మున్సిపల్ కార్యాలయంలో హెట్రో పరిశ్రమ సౌజన్యంతో 80 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న అదనపు అంతస్తులు, పశువుల ఆసుపత్రిలో న్యూ ల్యాండ్ పరిశ్రమ సహకారంతో 33 లక్షల రూపాయలు నిర్మించి తలపెట్టిన అదనపు గదుల నిర్మాణ పనులకు గురువారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. .jpeg)
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దశరథ్, తహసిల్దార్ పరమేశం, ఎంపీడీవో ఉమాదేవి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, హుస్సేన్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
07 May 2026
