చింతకుంటలోని రామ్ లీలా ఉత్సవాలు జయప్రదం చేయాలి

ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల

కరీంనగర్ : 

 

 

WhatsApp Image 2025-09-21 at 5.49.31 PM

దసరా ఉత్సవాల్లో భాగంగా చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్ వద్ద మొట్టమొదటిసారి రామ్ లీలా ఉత్సవాలను వచ్చే నెల 2వ తేదీన మంజునాథ యూత్ ఫ్రెండ్స్ గుర్రాల జయప్రకాశ్ రెడ్డి  నిర్వహణలో నిర్వహిస్తున్నారని, ప్రజలు జయప్రదం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.  ఆదివారం ఉత్సవాల గోడ ప్రతిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామస్థులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించనుకునే పండుగ దసరా అని పండుగకు చింతకుంట  మొదటిసారి రామ్ లీలా ఉత్సవాలు నిర్వహించడం అభినందనిమన్నారు.  నిర్వాహకులు జయప్రకాశ్ రెడ్డి మిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ ఉత్సవానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీఇచ్చారు.  ప్రభుత్వం , నగర పాలక సంస్థ  సహకారాలు అందించాలని కోరారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ రామ్ లీలా కు కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలు, నగర ప్రజలు  అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ  కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ మండల వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్, మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, మండల యూత్ నాయకులు పెరుమళ్ళ కమల్ గౌడ్,  బెజ్జంకి సంపత్, మణికంఠ గౌడ్ సాయి గౌడ్ సోను మహేష్ ప్రవీణ్ ఈశ్వర్ వేణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

About The Author