భారీగా గంజాయి పట్టివేత.. కియా కారులో అక్రమ రవాణా!

  • ​ఒడిశా టు మహారాష్ట్ర.. రూ. 41.21 లక్షల సరుకు సీజ్
  • ​ముఠా గుట్టురట్టు చేసిన మల్కాజిగిరి SOT, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు
  • ​ఇద్దరు నిందితుల అరెస్ట్.. 164.86 కిలోల గంజాయి స్వాధీనం

భారీగా గంజాయి పట్టివేత.. కియా కారులో అక్రమ రవాణా!

హయత్‌నగర్:

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ.. అడ్డదారిలో డ్రగ్స్ రవాణా! ఒడిశా నుంచి కారులో గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును మల్కాజిగిరి ఎస్‌ఓటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం జరిపిన మెరుపు తనిఖీల్లో సుమారు రూ. 41.21 లక్షల విలువైన 164.86 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రవాణాకు వాడిన కియా కారుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

​ట్రిప్పుకు 60 వేల ఆశ చూపి..

​పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశా గజపతి జిల్లాకు చెందిన నబిన్ సాబర్ (28), సుధాకర్ మండల్ (27) వృత్తిరీత్యా డ్రైవర్లు. ఆర్థిక ఇబ్బందుల సాకుతో వీరు గంజాయి రవాణా వైపు మళ్లారు. బరంపురానికి చెందిన ఓ డ్రగ్ పెడ్లర్ వీరికి వల వేశాడు. ఒడిశా నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు గంజాయిని చేరవేస్తే ఒక్కో ట్రిప్పుకు రూ. 60 వేలు ఇస్తామని ఆశ చూపాడు. దీనికి ఒప్పుకున్న నిందితులు గతంలో రెండుసార్లు కర్ణాటకకు సక్సెస్‌ఫుల్‌గా సరుకును చేరవేశారు.WhatsApp Image 2026-03-02 at 19.47.13 (1)

​కారు డిక్కీలో 80 ప్యాకెట్లు..

​ఈసారి 164.86 కిలోల గంజాయిని 80 ప్యాకెట్లుగా ప్యాక్ చేసి, కియా కారు డిక్కీలో రహస్యంగా దాచారు. హైదరాబాద్‌లోని ఎగ్జిట్ నంబర్ 11 వద్ద సరుకు డెలివరీ చేసేందుకు బయలుదేరారు. అయితే, పక్కా సమాచారంతో నిఘా పెట్టిన ఎస్‌ఓటీ క్యాంటోన్మెంట్ జోన్ బృందం, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు నల్గొండ ధర్మకాంట సమీపంలో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వచ్చిన కియా కారును ఆపి సోదా చేయగా అసలు విషయం వెలుగుచూసింది.

​గతం నుంచి గంజాయి అలవాటే!
​నిందితుడు నబిన్ సాబర్‌పై గతంలోనూ ఒడిశాలోని సాదర్ బెహ్రాంపూర్ పీఎస్‌లో కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై ఎన్.డి.పి.ఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో ఎల్‌బీ నగర్ జోన్ డీసీపీ డా. బి. అనురాధ, ఎస్‌ఓటీ అధికారులు, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About The Author