క్రీడలు సమైక్యతకు చిహ్నం...

  • 29 వ వార్డులో ఉత్సహాంగా ముగిసిన క్రీడలు
  • సూర్ణపు సావిత్రమ్మ స్ఫూర్తితో 
    సంక్రాంతి సంబరాలు 
  • గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు బహుకరణ
  • మాజీ జాతీయ కోకో క్రీడాకారుడు, మా అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రమ్

క్రీడలు సమైక్యతకు చిహ్నం...

మహబూబాబాద్ :

కులమత ప్రాంతీలకతీతంగా నిర్వహించే క్రీడా పోటీలు సమైక్యతకు చిహ్నంగా నిలుస్తాయని, గెలుపు ఓటమిలు సహజమని మాజీ జాతీయ కోకో క్రీడాకారుడు, మా అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రమ్ అన్నారు. 29 వ వార్డులో దివంగత ఐద్వా పట్టణ నాయకురాలు సుర్ణపు సావిత్రమ్మ స్మారకార్దంగా, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని    సంక్రాంతి క్రీడోత్సవాలు రెండు రోజులు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలలో 14 సంవత్సరాలలోపు బాలురకు కబడ్డీ, మహిళలకు కబడ్డీ, ముగులు, మ్యూజికల్ చైర్, తాడు ఆట పోటీలు నిర్వహించారు. మొదటి రోజు ఆటలు సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ ప్రారంభించగా చివరి రోజు ఆటకు మా అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రమ్ టాస్ వేశారు. చివరి రోజు సోమవారం దైద సురేందర్ అధ్యక్షతన జరిగిన క్రీడల ముగింపు వేడుకలో పాల్గొని ఆయన మాట్లాడుతూ... పట్టణం నుండి గుమ్మనూరు ప్రాంతంలో గత 30 ఏళ్లుగా  పండుగల సందర్భంగా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా రావడం అభినందనీయ మని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళామణులు రంగురంగుల ముగ్గులతో రంగవల్లులు అలంకరించడం ఈ ప్రాంత ప్రత్యేకత అన్నారు. కబడ్డీ పోటీలలో 14 సంవత్సరాల బాలురు అత్యంత ప్రతిభ చూపారని అన్నారు. ఐద్వా  ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలకు మహిళల నుండి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. మహిళలు కూడా కబడ్డీ, తాడు ఆట, మ్యూజికల్ చైర్ లాంటి క్రీడా పోటీలలో పాల్గొని  అత్యంత ప్రతిభను ఉత్సాహంగా చూపరని అన్నారు. ఆటలు అంతరించి పోతున్న తరుణంలో  క్రీడలలో ప్రతిభ కనపరిచి ఆటలను బ్రతికించడం అభినందనీయమని అన్నారు. కన్న తల్లి జ్ఞాపకార్ధకంగా కూతుళ్లు స్వప్న, స్వరాజ్యం, కుమారుడు శ్రావణ్ లు ముందుకు వచ్చి ఇలాంటి క్రీడలు నిర్వహించడం పట్ల కుటుంబ సభ్యులని అభినందించారు. సావిత్రమ్మ భర్త, సిపిఎం నాయకులు సూర్ణపు సోమయ్య మాట్లాడుతూ...నా జీవిత భాగస్వామి జ్ఞాపకర్ధకంగా నిరంతరం క్రీడలు ప్రోత్సాహం చేస్తూ ఉంటామని పేర్కొన్నారు. 

బహుమతులు ప్రధానం

14 సంవత్సరాలలో బాలుర కబడ్డీ పోటీలలో 14 టీమ్ లు పాల్గొనగా గుమ్మునూర్ సి బాలురు మొదటి బహుమతి, జయ్యారం మెగ్య తండా బాలురకు రెండో బహుమతి,మూడో బహుమతి గుమ్ముడూర్ బి టీమ్, కబడ్డీ మహిళలు మొదటి బహుమతి సూర్ణపు దివ్య, గుమ్మడి సరిత, సూర్ణపు శైలజ, కందుకూరి రాజ్యలక్ష్మి, మధులిక, నీరుడు జానవి, కునపూరి శ్రీకళ, రెండో బహుమతి వెన్నమల్ల శ్రావణి, మంద సంధ్య, శిరీష, అనూష, శైలజ, వసంత, వాని, శ్రావణి లకు అందజేశారు. తాడు ఆటలో రమ్య,శ్రావణి,సంధ్య,వాణి, రజిత పావని,రేణుక, శైలజ, మ్యూజికల్ చైర్ ఆటలో మొదటి కందుకూరి రాజ్యలక్ష్మి, ద్వితీయ కందుకూరి లోహిత, తృతీయ గుమ్మడి సరిత, ముగ్గుల పోటీలలో మొదటి కునపూరి శ్రీకళ, ద్వితీయ కాడెబోయిన భవాని, తృతీయ దుస్స వర్శిత, కన్సోలేషన్ బహుమతులు జానవి, మధులిక, వైష్ణవి, ప్రియాంక, శైలజ, కావ్య శ్రావణి లకు అందజేశారు.   ఈ కార్యక్రమంలో జాతీయ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు రవి, న్యాయవాది దర్శనం రామకృష్ణ, పోస్టల్ ఉద్యోగి రామచందర్,  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల రాజు, సూర్ణపు ముత్తయ్య, నీరుడు జంపయ్య, సూర్ణపు స్వప్న, స్వరాజ్యం, శ్రావణ్, కిరణ్, అక్కి ప్రశాంత్, కోచ్ జ్యోతి, శివ  తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts