వెంటనే పెన్షన్ పెంచాలని డిమాండ్ జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు
వికలాంగుల సంఘం జిల్లా నాయకులు బురుగుల రాజు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :

వికలాంగుల పింఛను రూ 6000 పెంచాలి. వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు నేత,గీత, బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్ దారులకు రూ 4000 పెన్షన్ పెంచాలి. ఇప్పటికే నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేయాలి.
పై విషయమై తమతో మనవి చేయునది ఏమనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ రూ 4000 నుండి రూ 6000/- పెంచుతామని, అలాగే వృద్ధులు వితంతువులు, బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు రూ 2000/-నుండి రూ 4000/- పెంచుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవీ చేపట్టి 22 నెలలు గడిచినా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచలేదు.ఇది ఘోరమైన మోసం.అంగవైకల్యం, నిస్సహాయ స్థితి, నిరాదరణ వల్ల ఇప్పటికే ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటున్న వికలాంగులు, వృద్ధులు, వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారుల యొక్క దీన పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నాం.
