రాక్ టౌన్లో హిందూ సమ్మేళన హోరు
ఆధ్యాత్మిక వైభవంతో పులకించిన రాక్ టౌన్ కాలనీ.. సాంస్కృతిక ప్రదర్శనలతో అదరగొట్టిన చిన్నారులు
ఎల్బీనగర్, :
హైదరాబాద్లోని రాక్ టౌన్ బస్తీ మంగళవారం రాత్రి ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోయింది. హిందూ సమ్మేళన మహోత్సవం పేరిట నిర్వహించిన ఈ వేడుక అత్యంత వైభవంగా సాగింది. సుమారు 1200 మందికి పైగా మహిళలు, చిన్నారులు, స్థానికులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
సంస్కృతి పరిరక్షణ అందరి బాధ్యత:
*మల్లంపాటి భారతి (అసోసియేట్ ప్రొఫెసర్) భారతీయ జీవన విధానంలో కౌశలం, సంప్రదాయాల పాత్రను వివరించారు.
డాక్టర్ భాస్కర యోగి:సాహిత్య ప్రచారం ద్వారా ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. అనంతానంద భారతి స్వామి హిందూ ధర్మ పరిరక్షణపై అనుగ్రహ భాషణం చేస్తూ భక్తులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతిభకు పురస్కారం:
వివిధ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించారు. రిటైర్డ్ తహసీల్దార్ హనుమంతరావు నేతృత్వంలోని నిర్వహక సమితి సభ్యులు సమష్టిగా కృషి చేసి ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ తరహా కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు..jpeg)
