ఆత్మీయంగా మహిషాసుర మర్ధినీ స్తోత్రం

WhatsApp Image 2025-10-26 at 6.25.33 PM

సంగారెడ్డి : 

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని లలిత, ప్రదర్శన కళలు, మీడియా స్టడీస్ విభాగాలు సంయుక్తంగా మహిషాసుర మర్ధినీ స్తోత్రం యొక్క ఆత్మీయ ప్రదర్శనను నిర్వహించాయి. సమకాలీన సృజనాత్మకతతో శాస్త్రీయ భక్తిని అందంగా మిళితం చేసిన ఈ ప్రదర్శన, గీతం విద్యార్థుల కళాత్మక ప్రతిభను ప్రదర్శించింది. గీతంలో బీఏ, బీబీఏ, సీఎస్ఈ చదివే విద్యార్థులు సుచి పాండే, శ్వేతశ్రీ, నాగభూషిత, సాయి లేఖన, విశ్వజనని, వర్ష సత్యనారాయణ, అభ్యుదయ్ సుర, దీపక్ కుమార్, ఆనంద్ కంచి, నందిత్, రేవంత్, నిధీష్ కడవేర్గు, నితిన్ జాసన్ ఈ అద్భుతమైన గీతాన్ని ఆలపించారు. భావనతో పాటు, సంగీతాలను లలిత, ప్రదర్శన కళల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు మృదురవళి దర్భ, ఆనందు మురళి రూపొందించారు. ఈ ప్రదర్శనలో చంద్రకాంత్ పెర్కషన్లపై, మహావాది వాసు విశ్వనాథ్ వయోలిన్ పై, రాఘవ సాయి ఫ్లూట్, కీబోర్డు, ఆడియో మిక్సింగ్ లతో సహకరించారు. ఆడియో, సౌండ్ ఇంజనీరింగ్ ను మీడియా స్టడీస్ ప్రొఫెసర్ (ప్రాక్టీస్) ఎస్.ఆర్. సంజీవ్ కుమార్ నిర్వహించగా, కృష్ణ గంగాధర్ విజువల్స్ కు దర్శకత్వం వహించారు. సీతారాం వీడియో ఎడిటింగ్, ఫైనల్ మిక్స్ నిర్వహించారు. గీతం యొక్క అంతర్ విభాగ స్ఫూర్తిని ఈ సహకార నిర్మాణం ప్రతిబింబించడమే గాక, కళ, భక్తి, సృజనాత్మకతను ఏకతాటిపై జరుపుకోవడానికి, విభిన్న విభాగాల విద్యార్థులు, అధ్యాపకులను ఒకచోట చేర్చింది.

About The Author