తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బుద్ధ జయంతి ఉత్సవాలలో హైకోర్ట్ అడ్వకేట్ ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొనడం జరిగింది
హైదరాబాద్:
ఈరోజు తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బుద్ధ జయంతి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించడం జరిగింది. బౌద్ధ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, శాంతి, అహింస, సత్యం అనే మానవ విలువలను బోధించిన గౌతమ బుద్ధుడు స్ఫూర్తి నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోంది
ఆ మహనీయుడి ఆలోచనలను ఆచరణలో పెట్టి, ఆయన చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి
ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి , చిక్కుడు ప్రభాకర్ , సీనియర్ కౌన్సిల్ హైకోర్ట్ అడ్వకేట్, జాయింట్ సెక్రటరీ కృష్ణ కీర్తన, హైకోర్ట్ అడ్వకేట్ ఐలాపూర్ మాణిక్ యాదవ్ , ఇతర బార్ కౌన్సిల్ సభ్యులు మరియు సీనియర్ అడ్వకేట్స్ పాల్గొని వేడుకలను మరింత ఘనంగా నిర్వహించారు..jpeg)
