బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు.. సైబర్ నేరగాళ్ల దుస్సాహసం

బిహార్‌లో సైబర్ నేరగాళ్లు తెలంగాణ పోలీసులపై కాల్పులు జరిపారు. సైబర్ నేరాలకు పాల్పడిన ముఠాను తీసుకురావడం కోసం ఈ నెల 11న పోలీసులు బిహార్ వెళ్లారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నంలో.. పోలీసులపై కాల్పులు జరిపారు. వెహికల్ కంపెనీ ప్రాంఛైజీల పేరిట సైబర్ మోసాలకు పాల్పడిన నిందితులు నవాడా జిల్లాలోని భవానిబిగా గ్రామంలో ఉన్నారని పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసుల సాయం తీసుకొని.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ప్రధాన నిందితుడైన మితిలేశ్ పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యాడు. మిగతా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి దగ్గర్నుంచి రూ.1.22 కోట్ల నగదు, 3 కార్లు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కాల్పులు జరిపినప్పటికీ.. అదృష్టవశాత్తూ పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదు. నిందితులను స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం… వారంట్‌పై నగరానికి తీసుకురానున్నారు.

బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు.. సైబర్ నేరగాళ్ల దుస్సాహసం

బిహార్‌లో సైబర్ నేరగాళ్లు తెలంగాణ పోలీసులపై కాల్పులు జరిపారు. సైబర్ నేరాలకు పాల్పడిన ముఠాను తీసుకురావడం కోసం ఈ నెల 11న పోలీసులు బిహార్ వెళ్లారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నంలో.. పోలీసులపై కాల్పులు జరిపారు. వెహికల్ కంపెనీ ప్రాంఛైజీల పేరిట సైబర్ మోసాలకు పాల్పడిన నిందితులు నవాడా జిల్లాలోని భవానిబిగా గ్రామంలో ఉన్నారని పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసుల సాయం తీసుకొని.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

కానీ ప్రధాన నిందితుడైన మితిలేశ్ పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యాడు. మిగతా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి దగ్గర్నుంచి రూ.1.22 కోట్ల నగదు, 3 కార్లు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కాల్పులు జరిపినప్పటికీ.. అదృష్టవశాత్తూ పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదు. నిందితులను స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం… వారంట్‌పై నగరానికి తీసుకురానున్నారు.

About The Author

Related Posts