గీతంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీ.ఎడ్.
2026-27 విద్యా సంవత్సరం నుంచి ఆరంభం
ఎన్.సి.ఇ.టి.లో అర్హత సాధించడం తప్పనిసరి
పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (సమగ్ర ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాన్ని)ను ప్రవేశపెట్టనుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా బి.ఏ. బి.ఎడ్., బి.ఎస్సీ. బి.ఎడ్. అనే నాలుగేళ్ల డ్యూయల్-మేజర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను అందిస్తుందని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రిచా శర్మ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. భారతదేశ జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 చట్రంలో ఇది భాగమని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ శర్మ వివరిస్తూ, భవిష్యత్తు కోసం అత్యంత అర్హత కలిగిన, బహుళ-విషయ పరిజ్జానం గల విద్యావేత్తలను తయారు చేసే లక్ష్యంతో, 12 తరగతి లేదా ఇంటర్మీడియెట్ తరువాత వెంటనే విషయ పరిజ్జానాన్ని వృత్తిపరమైన బోధనా శిక్షణతో అనుసంధానించడానికి సమగ్ర ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. పాఠశాల విద్యలోని వివిధ దశలలో ఉన్న విద్యార్థుల కోసం వారి వయస్సుకు తగిన అభ్యాస అనుభవాలను సృష్టించగల ఉత్సాహవంతులైన, వృత్తిపరంగా శిక్షణ పొందిన, సామాజిక బాధ్యత గల ఉపాధ్యాయులను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలియజేశారు.
ఈ సమగ్ర అండర్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం, కొత్త పాఠశాల నిర్మాణంలోని నాలుగు దశలైన- ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ (5+3+3+4) కోసం ఉపాధ్యాయులను సిద్ధం చేస్తుందని డాక్టర్ రిచా వివరించారు. విద్యార్థులు సాంప్రదాయ ఐదేళ్ల మార్గానికి బదులుగా తమ ఉపాధ్యాయ విద్యను నాలుగేళ్లలో పూర్తి చేయవచ్చని, తద్వారా ఒక విద్యా సంవత్సరాన్ని ఆదా చేసుకోవచ్చని ఆమె తెలిపారు.
మరిన్ని వివరాల కోసం, ఆసక్తి గల విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు 95 42 42 42 59 / 66 లను సంప్రదించాలని, లేదా గీతం అధికారిక వెబ్ సైట్ www.gitam.edu ను సందర్శించాలని డాక్టర్ రిచా సూచించారు.
