సాయిరాం కాలనీలో 'మీ సురక్ష' పై అవగాహన సదస్సు నిర్వహణ
ఎల్బీనగర్:
మల్కాజ్ గిరి పోలీస్ కమీషనర్ సుమతి ఆదేశాల మేరకు కర్మన్ఘాట్లోని సాయి రామ్ నగర్ కాలనీ పార్క్లో సరూర్ నగర్ పోలీస్ అధికారులు మీ సురక్ష ఎన్యుమరెషన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేర నివారణ వలన జరిగే ఉపయోగం గూర్చి, నేర నిర్ధారణ గురించి విపులంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రజలకు మీ సురక్ష ఎన్యుమరేషన్ యొక్క ఉపయోగాలు మరియు ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు.ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ సీఐ శ్రీశైలం, చంపాపేట్ సెక్టార్ ఎస్సై మారయ్య పలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
26 May 2026
