నేటి భారతం

download

న్యాయం ఆలస్యమైనా తప్పక రావాలి, 
ఆలస్యమై రాకపోతే అది అన్యాయం అవుతుంది.
సమాజానికి నిజమైన రక్షణ కత్తుల్లో కాదు, 
న్యాయ వ్యవస్థలో ఉంటుంది.
న్యాయం ముందు అందరూ సమానులే; 
ధనికుడు, పేదవాడు, అధికారి, సామాన్యుడు 
అన్న తేడా ఉండకూడదు.
కోర్టు తీర్పులు కేవలం కేసులు ముగించకూడదు, 
సమాజానికి న్యాయం చేయాలి.
బలహీనుల కన్నీళ్లను తుడిచే శక్తి 
న్యాయ వ్యవస్థలోనే ఉంది.
న్యాయమనే భూమికపై మాత్రమే 
ప్రజాస్వామ్యం నిలబడగలదు.
ఓ మారణాయుధం చేతిలో ఉన్నవాడి కంటే, 
న్యాయం చేతిలో ఉన్నవాడే శక్తివంతుడు.
న్యాయవ్యవస్థలో విశ్వాసం కోల్పోతే, 
ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది.
చట్టం కఠినమైనదే కావచ్చు, 
కానీ అది న్యాయం చేసే సాధనం కావాలి.
నిజం, న్యాయం, ధర్మం.. 
ఇవే న్యాయస్థానపు మూల స్తంభాలు.

Read More సిక్కుల సంక్షేమానికి అండగా ఉంటాం

- బోయినపల్లి రమణా రావు, సీనియర్ జర్నలిస్ట్..

Read More మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి : జిల్లా కలెక్టర్

About The Author