17న లబ్ధిదారుల ధృవపత్రాల పరిశీలన
ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి వెల్లడి,
ఆదిభట్ల:
0ఆదిభట్ల సర్కిల్-15 (ఆదిభట్ల, తుర్కయంజాల్) పరిధిలో ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్ పథకాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ధృవపత్రాల పరిశీలన ఈ నెల 17న (బుధవారం) నిర్వహించనున్నారు. రాగన్నగూడలో ఉదయం 11 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్, ఆదిభట్ల సర్కిల్-15 డిప్యూటీ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
*తీసుకెళ్లాల్సిన పత్రాలు:
ఎస్సీ కార్పొరేషన్ కింద ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, అలాగే మైనారిటీ కార్పొరేషన్ కింద ద్విచక్ర వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఈ క్రింది ఒరిజినల్ పత్రాలతో పాటు వాటి జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
* ఆన్లైన్ దరఖాస్తు ఫారం (Original Application Form)
* ఆధార్ కార్డు
* కుల ధృవీకరణ పత్రం (Caste Certificate)
* ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate)
* బ్యాంకు పాస్బుక్
* డ్రైవింగ్ లైసెన్స్ (వర్తించే వారు మాత్రమే)
అర్హులైన లబ్ధిదారులందరూ నిర్ణీత సమయానికి హాజరై ధృవపత్రాల పరిశీలనను పూర్తి చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ కోరారు.
