నగరంలో 12 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్

  • వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ యాక్షన్ ప్లాన్
  • *150 వార్డుల్లో ఐదు దశల్లో వ్యర్థాల తొలగింపు
  • *నిలకడ నీటి నివారణ, దోమల నియంత్రణే లక్ష్యం

నగరంలో 12 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్

హైదరాబాద్:

వర్షాకాలాన్ని పురస్కరించుకుని నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నడుం బిగించింది. ఇందులో భాగంగా జూన్ 14 నుండి 25 వరకు 12 రోజుల పాటు నగరవ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. నగరంలోని అన్ని జోన్లు, సర్కిళ్లలో సమగ్ర పారిశుద్ధ్య, ప్రజారోగ్య చర్యలను ముమ్మరం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించారు. అన్ని వార్డుల్లో పేరుకుపోయిన పాత వ్యర్థాలను పూర్తిగా తొలగించి, వంద శాతం పరిశుభ్రత సాధించడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ కొనసాగుతోంది.

*ఐదు దశల్లో 150 వార్డులు
నగరంలోని 150 వార్డులను ఐదు దశలుగా విభజించి, ఒక్కో దశలో 30 వార్డుల చొప్పున ఈ పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సాధారణ పారిశుద్ధ్య పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. రహదారులు, నాలాలు, చెరువుల పరిసరాలు, ఫుట్‌పాత్‌లు, పార్కుల్లో పేరుకుపోయిన మున్సిపల్ ఘన వ్యర్థాలు, నిర్మాణ-కూల్చివేత వ్యర్థాలు (సీ అండ్ డీ), పచ్చి వ్యర్థాలు, మట్టి మరియు సిల్ట్‌ను ప్రత్యేక సిబ్బంది తొలగిస్తున్నారు.

*మళ్లీ చెత్త వేస్తే చర్యలు!
వ్యర్థాలను తొలగించిన ప్రాంతాల్లో తిరిగి చెత్త వేయకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు తీసుకోనుంది. సదరు ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు, హరితవనాలను అభివృద్ధి చేయడంతో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.

*రంగంలోకి ప్రత్యేక బృందాలు
జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, కావడిగూడ సహా పలు సర్కిళ్లలో ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలు క్షేత్రస్థాయిలో పనులను ముమ్మరం చేశాయి. వర్షపు నీరు సజావుగా సాగిపోయేలా వర్షపునీటి కాలువలను శుభ్రం చేయడం, పూడిక తీయడం లాంటి పనులు చేపట్టారు. వర్షాకాల వ్యాధులు ప్రబలకుండా దోమల లార్వాల నివారణ చర్యలు, ఫాగింగ్, వాహక నియంత్రణ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. జోనల్ కమిషనర్లు (జెడ్సీలు), డిప్యూటీ కమిషనర్లు (డీసీలు), ఈఈలు క్షేత్రస్థాయిలో పనులను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

*ఇంటింటికీ వెళ్లి అవగాహన
పట్టణ కమ్యూనిటీ అభివృద్ధి విభాగం (UCD), స్వయం సహాయక సంఘాల సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తడి-పొడి చెత్తను వేరు చేయడం, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంపై నివాసితులకు వివరిస్తున్నారు.

*పౌరులకు విజ్ఞప్తి:
రోడ్లు, ఫుట్‌పాత్‌లు, నాలాల్లో వ్యర్థాలను వేయవద్దని, నిర్మాణ వ్యర్థాలను అధికారిక మార్గాల ద్వారానే తొలగించాలని జీహెచ్‌ఎంసీ కోరింది. చెత్త పేరుకుపోయిన ప్రాంతాలు, అక్రమ డంపింగ్‌పై పౌరులు కింది మార్గాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు:
 * *యాప్:* మై జీహెచ్‌ఎంసీ (క్యూఆర్ యాప్)
 * *కాల్ సెంటర్:* 040-21111111
 వాట్సాప్ నంబర్:* 8125966586
 సోషల్ మీడియా:
@GHMCOnline (ట్విట్టర్/ఎక్స్)WhatsApp Image 2026-06-15 at 20.25.55 (1)

About The Author