ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

WhatsApp Image 2025-10-29 at 6.32.46 PM

కామారెడ్డి జిల్లా : 

Read More సాహితీ రాము స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల శబరిమల మహాపాదయాత్ర

ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ  హిందూస్తాన్ యూనిలివర్ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు ను బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో 
నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.

Read More పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  ఎపిసి  ఆదేశాల మేరకు ప్రతి వ్యవసాయ ప్రాథమిక సంఘానికి 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యం ఇవ్వడం జరిగిందని,  ఆయిల్ పామ్ పంట సాగు, నాటడం, చీడపీడల నివారణ చర్యలు , మార్కెటింగ్ గురించి  ప్రతీ ఒక్క అంశం పై అవగాహన కలిగి ఉండాలని, నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆన్నారు.

Read More ప్రశంసా పత్రాలు అందుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ పీఆర్వో నరిమెట్ల వంశీ..

ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారుతుందని, దీనిని శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టాలని సూచించారు. అలాగే, ఈ రంగంలో ప్రభుత్వం,  సహకార సంఘాలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. 

Read More భైంసా నూతన ఎంపీఓ గా జాదవ్ ప్రదీప్ బాధ్యతలు స్వీకారం.

ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ పంట యొక్క ఆర్థిక ప్రాధాన్యత, సాగు పద్ధతులు, నీటి వినియోగం, వాతావరణ అనుకూలత, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మార్కెట్ అవకాశాలపై సంబంధిత అధికారులు విశదీకరించారు.
 
ఈ కార్యక్రమంలో  జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. మోహన్ రెడ్డి, జిల్లా కోపరేటివ్ అధికారి రామ్మోహన్, పిఎసిఎస్ కార్యదర్శులు, వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యాన, ఉద్యాన విస్తరణ అధికారులు, ఆయిల్ పామ్ ప్రతినిధులు, డ్రిప్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలి..

About The Author