ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా :
ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ హిందూస్తాన్ యూనిలివర్ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు ను బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో
నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారుతుందని, దీనిని శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టాలని సూచించారు. అలాగే, ఈ రంగంలో ప్రభుత్వం, సహకార సంఘాలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. మోహన్ రెడ్డి, జిల్లా కోపరేటివ్ అధికారి రామ్మోహన్, పిఎసిఎస్ కార్యదర్శులు, వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యాన, ఉద్యాన విస్తరణ అధికారులు, ఆయిల్ పామ్ ప్రతినిధులు, డ్రిప్ ప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author
30 May 2026
