రానున్న మూడు రోజులు తుఫాను ప్రభావం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలి..
- రాష్ట్ర పౌర సరఫరాలు శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, - రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భూపాలపల్లి :
హైదరాబాద్ నుండి ధాన్యం, పత్తి, మొక్క జొన్న, సోయా కొనుగోళ్లు, రానున్న మూడు రోజులు తుఫాను ప్రభావం ఉన్న దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పకడ్బందీ టీము వర్కుతో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కొనుగోలు చేయాలని సూచించారు. తుఫాను తీరం దాటే సమయంలో ఎక్కువ ప్రభావం ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తూఫాను తీవ్రత తగ్గే వరకు రైతులు కోతలు కొయొద్దని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణా చేయాలని ఆదేశించారు. ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆరుబయట ఉన్న ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుండి దాన్యం, మొక్కజొన్న, సోయా రాకుండా పటిష్టv పర్యవేక్షణ చేయాలని తెలిపారు. పంటలను మ్యాచింగ్, బ్యాచింగ్ చేయాలని స్పష్టం చేశారు. రైతులు పత్తి పంటను తేమ లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, రాబోయే మూడు రోజుల్లో తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వరి పంట సాగు చేసిన రైతులు తుఫాన్ తరువాత పంట కోతలు కోయాలని కోతలు వాయిదా వేయడం వల్ల ధాన్యం పాడవకుండా ఉంటుందని, కోతలు కోయకుండా ఉంటే పంట త్వరగా ఆరడానికి అవకాశం ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సరిహద్దు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సన్న వడ్ల కు బోనస్ చెల్లిస్తున్నందున ఇతర రాష్ట్రాల నుండి వచ్చి రైతులు మన రాష్ట్రంలో ధాన్యం అమ్మే అవకాశం ఉందని కలెక్టర్లు అప్రమత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇది చాలా క్రుషియల్ సమయమని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8342 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
