మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి : జిల్లా కలెక్టర్

WhatsApp Image 2025-11-06 at 6.51.57 PM

ములుగు జిల్లా ప్రతినిధి : 

Read More మాజీ సీఎం రోశయ్యకు ఘన నివాళి

మత్స్యకారుల ఆర్థిక  అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. ములుగు జిల్లా వేంకటపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామము లోని మారేడుగొండ చెరువులో గురువారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ & స్పెషల్ ఆఫీసర్ హనుమంతరావు,  జిల్లా మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు సాదు రఘు, జిల్లా మత్స్య శాఖ అధికారి టి.సల్మాన్ రాజు, లక్ష్మీదేవిపేట సొసైటీ అధ్యక్షుడు సాదు శంకర్ లతో కలిసి చేప పిల్లలను చెరువు లో వదిలారు.

Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం

అనంతరం  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2025-2026 సం: నకు (478) సీజనల్ చెరువులు,  (02) రిజర్వాయర్ లు , (08) పెరినియల్ చెరువులలో 1,57,55,224 లక్షలచేప పిల్లల విడుదల/పంపిణీ కొరకు అన్నిఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. చేప పిల్లల పంపిణి ద్వారా చేపల ఉత్పతి, దిగుబడులు పెరగడం,మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరగడం, దళారుల ప్రమేయం తగ్గడం, మత్య్స కారులు స్వేచ్ఛగా అమ్ముకోవడం వలన గ్రామీణ ప్రాంతాలలోని వినియోగదారులకు తాజా చేపలు అందుబాటు ధరలకు దొరకడం,  ఇతర ప్రాంతాలకుఎగుమతులు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

Read More మాతృదేవోభవ అనాథ శరణాలయానికి విరాళం అందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

ఈ కార్యక్రమంలో ఫిషరీస్ టెక్నికల్ ఆఫీసర్ పి.రమేష్, ఎఫ్.ఎ.ఎన్. మౌనిక, ప్రజా ప్రతినిధులు, మత్స్య కారులు, తదితరులు పాల్గొన్నారు. 

Read More ఎస్జీఫ్ జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు అల్పోర్స్ ఇ-టెక్నో

About The Author