అర్ధరాత్రి ఫ్లైఓవర్ పై ఆక్సిడెంట్... తగలబడిన బీఎండబ్ల్యూ కారు
ఎల్బీనగర్:
అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బైరామల్ గూడ ఫ్లైఓవర్ పై మద్యం తప్పతాగి నడుపుతున్న బీఎండబ్ల్యూ కార్ ముందు వెళుతున్న డీసీఎం బొగ్గు లారీని ఢీ కొట్టడంతో ఉల్టా పడిపోయిన బొగ్గు లారీ. కారు డ్రైవ్ చేస్తున్న రాక్ టౌన్ నివాసి సాయి కీర్తన్ రెడ్డి తలకు గాయాలు,కామినేని హాస్పిటల్ లో చేర్పించిన డిఆర్ఎఫ్ సిబ్బంది. లారీని కారు గుద్దిన వెంటనే నిప్పు రవ్వలు అంటుకొని దగ్ధమైన బీఎండబ్ల్యూ కార్. సంఘటన స్థలిని పరిశీలించిన ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.
About The Author
03 Mar 2026
