ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: సుంకరి మల్లేష్
హైదరాబాద్:
అఖిల భారత బీఎంఎస్ అధ్యక్షుడు, ఈపీఎఫ్ఓ సీబీటీ సభ్యుడు సుంకరి మల్లేష్ను బీఎంఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై చర్చించారు.
సీపీఎస్ రద్దుపై దృష్టి: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) వల్ల ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని మల్లేష్ పేర్కొన్నారు.
స్టాఫింగ్ ప్యాటర్న్ మార్పు: మూడు కార్పొరేషన్ల విభజన నేపథ్యంలో ప్రస్తుత స్టాఫింగ్ ప్యాటర్న్ను పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు కొత్త నియామకాలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
బీఎంఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్, సీనియర్ నాయకులు జయేందర్, శ్రీధర్, బీఎంఈయూ (బీఎంఎస్) ప్రధాన కార్యదర్శి టి.కృష్ణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు బిక్షపతి, నాగమణి, అడిషనల్ జనరల్ సెక్రటరీ ప్రద్యుమన్, కోశాధికారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
