తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే (Telangana Assembly Elections) లక్ష్యంగా బీజేపీ (BJP) ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా గురువారం రాష్ట్ర పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) అధ్యక్షతన బీజేపీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, ముఖ్యనేతలు, జిల్లాల అధ్యక్షులు, ఇంచార్జ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా, ఎన్నికల నిర్వహణ కమిటీల ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరుగనుంది. రేపు (శుక్రవారం) జరిగే స్టేట్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలపై చర్చించనున్నారు. మరోవైపు ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (National BJP Chief JP Nadda) తెలంగాణకు రానున్నారు. రేపు ఘట్కేసర్‌లో జరగనున్న స్టేట్ కౌన్సిల్ మీటింగ్‌లో జేపీ నడ్డా పాల్గొననున్నారు.

తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే (Telangana Assembly Elections) లక్ష్యంగా బీజేపీ (BJP) ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా గురువారం రాష్ట్ర పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) అధ్యక్షతన బీజేపీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, ముఖ్యనేతలు, జిల్లాల అధ్యక్షులు, ఇంచార్జ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా, ఎన్నికల నిర్వహణ కమిటీల ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరుగనుంది. రేపు (శుక్రవారం) జరిగే స్టేట్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలపై చర్చించనున్నారు. మరోవైపు ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (National BJP Chief JP Nadda) తెలంగాణకు రానున్నారు. రేపు ఘట్కేసర్‌లో జరగనున్న స్టేట్ కౌన్సిల్ మీటింగ్‌లో జేపీ నడ్డా పాల్గొననున్నారు.

About The Author