ప్రభుత్వ పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం ఎంపీఓ చంద్రశేఖర్.

WhatsApp Image 2025-11-06 at 5.30.31 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : 

Read More ఎన్నికల సంఘం సూచించిన వివిధ రకాల 18 కార్డులను చూపించి ఓటు హక్కు వినియోగించవచ్చు...

వనల్ పడ్‌, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన బాల్యవివాహాల నివారణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే కార్యక్రమం వనాల్ పడ్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఎంపీ ఓ. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Read More మల్లారెడ్డిపల్లి గ్రామానికి సేవ చేస్తా ఆశీర్వదించండి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయని, విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టి భవిష్యత్తును సుసంపన్నంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి గాయత్రి మాట్లాడుతూ బాల్యవివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు.ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 

Read More గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను..

About The Author