పున్న నిర్మల జన్మదినాన విద్యార్థులకు పండ్లు నోటు పుస్తకాల పంపిణీ,
- వీఎం హోం పాఠశాలలో పండ్లు, పుస్తకాల పంపిణీ
- ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి
సరూర్నగర్
మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ పున్న నిర్మల గణేష్ నేత జన్మదిన వేడుకలు గురువారం సరూర్నగర్లో ఘనంగా జరిగాయి. ఆడంబరాలకు దూరంగా సామాజిక దృక్పథంతో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా, స్థానిక విక్టోరియా మెమోరియల్ (వీఎం) హోం విద్యార్థులకు పండ్లు, నోట్ పుస్తకాలు మరియు పెన్నులను పంపిణీ చేశారు.
రాజకీయాలతో పాటు సేవా నిరతి అవసరం
పెద్దఎత్తున తరలివచ్చిన నేతలు
కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ తలాటి రమేష్ నేత, ఖిల్లా మైసమ్మ దేవాలయ చైర్మన్ సురేష్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ నర్సింహారెడ్డి, సెక్రటరీ ప్రసాద్ పాల్గొన్నారు. వీరితో పాటు అకాడమీ కోఆర్డినేటర్ మాధురి, జగన్నాథం, నర్సింగ్, శివప్రసాద్, చంద్రమౌళి, వెంకటేశం, నరేందర్, రమాదేవి, సుజాత తదితరులు పాల్గొని నిర్మలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..jpeg)
