చిన్నారులు,మహిళల భద్రతకు పెద్ద పీట

హైదరాబాద్ :
మహిళలు, చిన్నారుల భద్రత కోసం సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈ వారం 27.12.2025 నుండి 02.01.2026 వరకు పలు విస్తృత చర్యలు చేపట్టమని డీసీపీ సృజన కరణం తెలిపారు.
యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో మొత్తం ఆరుగురు ట్రాన్స్ జెండర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ దాడులలో మూడు పిటా కేసులు నమోదు కాగా, ముగ్గురు బాధితులను రక్షించడంతో పాటు 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు. సైబరాబాద్ షీ టీం బృందాలు ఈ వారంలో మొత్తం 147 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించగా, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర ప్రవర్తనకు పాల్పడిన 45 మందిని రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో 52 పెటీ కేసులు నమోదు కాగా, మిగిలిన వారికి కౌన్సెలింగ్ చేశారు. అదేవిధంగా, మహిళల నుండి అందిన 26 ఫిర్యాదులను షీ టీం బృందాలు స్వీకరించాయన్నారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన కుటుంబ సమస్యలు ను పరిష్కరించే దిశగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు / సీడిఈడబ్ల్యూ (ఛ్డేవ్) కేంద్రాలు కీలక పాత్ర పోషించాయన్నారు. ఈ కేంద్రాల ద్వారా 22 కుటుంబాలను తిరిగి కలిపి, వారి కుటుంబాల్లో వెలుగులను నింపారు.
