అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమావేశం

- పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమావేశం

WhatsApp Image 2025-12-31 at 7.34.42 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : 

భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయిన పనుల శంకుస్థాపనల పై మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాల్టీ కి ప్రభుత్వం 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని కొన్ని చోట్ల పనులు పూర్తి చేయడం జరిగిందని పూర్తి చేసిన పనులకు శంకుశాపనలకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.పెండింగ్ లో ఉన్న పనులను త్వరిత గతిన పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్ల కు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. కొంత మంది కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టి సంవత్సరాలు గడుస్తున్న పూర్తి చేయడం లేదని అలాంటి కాంట్రాక్టర్ల కు 60 c కింద నోటీసులు జారీ చేసి కాంట్రాక్ట్ రద్దు చేయాలని తెలిపారు. మున్సిపాల్టీ పరిధిలోని ప్రమాదకరంగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి మున్సిపాల్టీ ఆదాయం వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రి పై ప్రత్యేక చర్యలు తీసుకొని ఆసుపత్రి ఆవారా  cc వేయాలని ,డ్రైనేజీ వ్యవస్థ ను మెరుగు పరచాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ..
అధికారులు సమన్వయంతో పని చేసి మున్సిపాల్టీ అభివృద్ధి కి చర్యలు చేపట్టాలని  ప్రతి పనికి ఒక టైం లైన్ ను నిర్దేశించి ఒక అధికారిణి నియమించాలని నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్ ల పై చర్యలు తిసుకుంటమని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author