ఐఐటి హైదరాబాద్ సహకారంతో సామాజిక సాధికారత
సంగారెడ్డి:
భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా మిషన్ ఐఐటి హైదరాబాద్ సహకారంతో క్యాంపస్ లో సామాజిక సాధికారత కోసం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ విధాన రూపకర్తలు విద్యావేత్తలు పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు పాల్గొని కృత్రిమ మేధా ఏఐ అభివృద్ధి సమాజంలో వినియోగం వాటి విడిచి విశిష్టత ఆధారిత అవకాశాలు సమాన ప్రాపర్యత అంశాలపై జాతీయ స్థాయి చర్చలు నిర్వహించారు. ఈ ప్రారంభ సమావేశంలో వర్కింగ్ గ్రూప్ భారత్ చైర్మన్ రాజేష్ అగర్వాల్ మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంబాసిడర్ థామస్ స్పైడర్ స్విట్జర్లాండ్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ కమ్యూనికేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి హైదరాబాద్ ఐఐటి డైరెక్టర్ మరియు డాక్టర్ నలిని కుమార్ శ్రీ వాత్సవ తెలంగాణ ప్రభుత్వ సంయుక్త డైరెక్టర్ భరత్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. వారు మాట్లాడుతూ శాస్త్రం ఆరోగ్యం మెటీరియల్ వంటి రంగాల్లో పురోగతికి దోహదం చేస్తుందని అయితే చివరికి ఇది భిన్నమైన సామాజిక ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చే ప్రజలకు ఉపయోగపడాలి అని అన్నారు. ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ లేబరల్ ఆర్ట్ తదితర విభాగాలను ఏకం చేయాలని బలమైన పునాది నుంచి వాస్తవ జీవిత అనువర్తనాల వరకు ప్రజల జీవితాలను మెరుగుపరచడం మా లక్ష్యమని వారు అన్నారు.
