విద్యార్థుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత...
- నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను సీజ్ చేసిన జిల్లా రవాణా అధికారి

కామారెడ్డి జిల్లా :
జిల్లాలో ఆటో రిక్షాలు, ఇతర వాహనాల ద్వారా ప్రయాణించే విద్యార్థుల భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు ఆటో రిక్షాలు, మినీ క్యాబ్లపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి మాట్లాడుతూ, విద్యార్థుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపే సమయంలో వారు సురక్షితమైన వాహనాలలో ప్రయాణిస్తున్నారా అనే విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని, అలాగే రహదారి భద్రతా నియమాలు పాటించేలా రవాణా శాఖకు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
