విజయాలను ప్రసాదించే విజయ దశమి

శ్రీ రాజరాజేశ్వరి స్తోత్రం

అంబా మోహిని దేవతా త్రిభువనీ 
ఆనంద సంధాయినీ; 
వాణీ పల్లవ పాణి వేణు మురళీ 
గాన ప్రియాలోలినీ।
కళ్యాణీ ఉడురాజబింబ వదనా
ధూమ్రాక్ష సంచారిణీ; 
చిద్రూపీ పరదేవతా భగవతీ 
శ్రీ రాజరాజేశ్వరీ॥

 

WhatsApp Image 2025-10-01 at 4.00.12 PM

సనాతన ధర్మం లో ప్రతి సంవత్సరము ఆశ్వయుజ మాసాన శుక్లపక్షంలో దశమి తిథి రోజున జరిపేదే విజయదశమి ఉత్సవం. ఇది శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజులపాటు జరుగుతుంది. దీన్నే 'దసరా' అని కూడా వ్యవహరిస్తారు. పదవ రోజున దశమిని విజయదశమి అంటారు. హైందవులకిది ప్రధానమైన పండుగ. "అశ్విన్యస్య సితే పక్షే దశమ్యాం సర్వకామార్థ సాధకః" అని ఈ శ్లోకం. ఆశ్వయుజ శుద్ధ దశమి నాటి సంధ్యా సమయాన్ని విజయకాలంగా గుర్తించారు పండితులు. సర్వకామార్ధ సాధకం విజయదశమి రోజున జనులందరూ సీమోలంఘనం చేస్తారు. అంటే ఆ రోజు సాయంకాలం గ్రామ ప్రజలందరూ తమ గ్రామ పొలిమేరలు దాటి వెళతారు. అక్కడ శమీ పూజ నిర్వహిస్తారు. శమీ వృక్షం (జమ్మి చెట్టు) ను మంగళ వాయిద్యాలతో, సుగంధ ద్రవ్యాలతో, అర్ఘ్య పాధ్యాలతో పూజిస్తారు. పూజా సమయంలో "శమీ శమయతే పాపం....రామస్య ప్రియ దర్శిని" అనే శ్లోకాన్ని పఠస్తారు. శమీ పాపాలను పోగొడుతుందని నమ్ముతారు. దేవి నవరాత్రులు రాక్షసులతో పోరాడి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుడిని అంతమందిస్తుంది. అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారి దేవాలయాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతగా అమ్మవారిని అలంకరించి పురోహితులు దీక్షతో పూజలు చేస్తారు. సప్తమి నాటి సరస్వతి, అష్టమి నాటి దుర్గాదేవి, నవమి నాటి మహిషాసుర మర్దిని మొదలైన అవతారాలు అమ్మవారి రూపాల్లో ప్రధానమైనవి. ఈ రోజున ఆయుధ పూజలు కూడా నిర్వహించే ఆచారం ఉన్నది. రామాయణ, భారతాల ప్రకారంగా పాండవులకు శ్రీరామచంద్రుడికి శమీ వృక్షము విజయాన్ని ప్రసాదించిందని తెలుస్తుంది. ఇలా విజయదశమి విజయాలను ఇచ్చే విజయదశమిగా హైందవులు నమ్ముతారు. అయితే ఇదే రోజు 1925 విజయదశమి రోజున నాగపూర్ లో డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవర్ గారు (డాక్టర్జీ) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS)ను స్థాపించారు. సరిగ్గా ఈ రోజుకి 100 సంవత్సరములు పూర్తి చేసుకుని శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS). ఇలా సనాతన హైందవ ధర్మానికి ప్రతీకగా విజయదశమి విజయాల పరంపరను గుర్తుచేసే మహోన్నతమైన ఉత్సవంగా హిందవులుజరుపుకుంటున్నారు.

ప్రతి సంవత్సరం ఆశీర్వదిజమాసంలో శుక్లపక్షంలో దశమి తిషధి రోజు జరిపేది విజయదశమి ఉత్సవం ఇది శుద్ధ పార్టీ నుంచి దశమి వరకు పది రోజులపాటు జరుగుతుంది దీన్ని దేవీ నవరాత్రులు అంటారు శరదృతువులో వస్తుంది కనుక శరన్నవరాత్రులు అంటారు 10 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి దసరా అని కూడా వ్యవహరిస్తారు పదవరోజును దశమి నాడు విజయదశమి హైందవులకు ప్రధానమైన పండుగ.
 అశ్విన్యస్య సితే పక్షి 
 దశమ్యం తారకోదయే। 
 సకాలో విజయే నామ; 
 సర్వ కామార్థ సాధకః॥
ఈ శ్లోకం ఆశ్వయుజ శుద్ధ దశమినాటి సంధ్యా సమయాన్ని విజయకాలంగా తెలుపుతుంది. ఇది సర్వాకామ్యార్థ సాధకం. దశమి రోజున జనులందరూ సీమోల్లంఘనం చేస్తారు. సీమోల్లంఘనం అంటే ఆ రోజు సాయంకాలం గ్రామ ప్రజలందరూ తమ గ్రామ పొలిమేర్లు దాటి వెళ్తారు. అక్కడ శమీ పూజ నిర్వహిస్తారు. శమీ వృక్షం (జమ్మి చెట్టు)ను మంగళ వాయిద్యాలతో, సుగంధ ద్రవ్యాలతో, అర్గపాధ్యాయులతో పూజిస్తారు. పూజా సమయంలో శమీ వృక్ష విశిష్టతను తెలియజేసే  శ్లోకాలు పఠిస్తారు.

శమీవృక్ష(జమ్మిచెట్టు)విశిష్టత 
 "శమీ శమయతే పాపం 
 శమీ శత్రువినాశనీ 
 అర్జునస్య ధనుర్ధారీ 
 రామస్య ప్రియదర్శిని 
 కరిష్యమాణ యాత్రయాం 
 యథా కాలం సుఖమయా 
 తత్ర నిర్విఘ్న కరీత్వం 
 భవ శ్రీరామ పూజితే"
శమీ వృక్షం పాపాలను పోగొడుతుంది. శత్రువులను నశింపజేస్తుంది. ఈ వృక్షం అర్జునుడిని ధనుస్సును ధరింపజేసింది. శ్రీరాముడికి ప్రియమైన సీతమ్మ దర్శనం కలిగించింది. తాను చేయబోయే విజయ యాత్రలో శ్రీరాముడిచే పూజలు అందుకున్న ఓ శమీ వృక్షమా! నాకు విఘ్నాలు కలుగకుండా చేయుము. అని ఈ శ్లోకం వివరిస్తుంది.

అర్జునస్య ధనుర్ధారీ
అజ్ఞాతవాస కాలంలో విరాటరాజు రాజ్యంలో తలదాచుకున్న పాండవులు తమ మహిమాన్వితమైన ఆయుధాలను శమీ వృక్షం పై ఉంచారని ఐతిహ్యం. ఉత్తర గోగ్రహణ కాలంలో అర్జునుడు తన గాండీవాన్ని శమీ వృక్షంపై నుంచి తీసుకొని మరల దాన్ని సంధించి యుద్దంలో విజయం సాధించాడు. విజయుడు విజయం సాధించిన ఆనాటి దశమి తిథియే ఈనాడు మనం జరుపుకుంటున్న విజయదశమి. ఈ భారత గాధ "అర్జునస్య ధనుర్ధారి" అనే విషయాన్ని వ్యక్తపరుస్తుంది.

రామస్య ప్రియదర్శినీ
శ్రీరామచంద్రుడు రావణునితో యుద్ధం చేస్తున్నప్పుడు రావణుడి శిరస్సులు తెగిపోతూ రక్త బిందువులు భూమి మీద పడుతున్న కొద్దీ శిరస్సులు తిరిగి యధా పూర్వకంగా అతుక్కుంటున్నాయి. ఈ స్థితిలో శ్రీరాముడు కలత చెందాడు. వెంటనే జగన్మాత దుర్గమ్మను పూజించి ఆమెను ప్రసన్నురాలిగా చేసుకున్నాడు. అంతవరకు నిద్రిస్తున్న ఆ దేవి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు మేల్కొంది. కనుక  ఆనాటి నుంచి శ్రీరాముడు అసాధారణ పరాక్రమంతో యుద్ధం చేసి పదవ రోజున అనగా విజయదశమి రోజున పూర్తిగా విజయాన్ని పొందాడు.  శ్రీరామచంద్రుడు శమీ వృక్షాన్ని పూజించి తన అర్ధాంగి సీతాదేవితో సహా అయోధ్యను చేరుకున్నాడు. ఈ కారణం వల్ల ఈ తొమ్మిది రోజులు అయోధ్యా వాసులు పండుగ జరుపుకొని దశమి రోజున శమీ పూజ నిర్వహించారు. ఈ రామాయణ గాధ "రామస్య ప్రియదర్శినీ" అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. అందుకే విజయదశమి రోజున శమీ పత్రాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకొని ఆలింగనాలతో ఆశీస్సులతో అభినందనలు తెలుపుకునే ఆచారం (ఈ పండగ రోజు) అనాదిగా వస్తున్నది. దీనివల్ల పరస్పరం ప్రేమాభిమానాలు పెరిగి సుఖశాంతులు కలుగుతాయని హైందవులు నమ్ముతారు.

ఆనందంగా ఆయుధ పూజ
దశమి రోజున ఆయుధ పూజను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఆయుధాలు మాత్రమే కాకుండా కులవృత్తులకు సంబంధించిన పరికరాలను ఆయా వృత్తుల వారు విజయదశమి రోజున పూజించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఈరోజు వాహనాలను పసుపు కుంకుమలతో పూలమానులతో మామిడి తోరణాలతో అలంకరించి వేడుకను జరుపుకుంటారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,దుర్గా వాహిని స్థాపన
1925 నాగపూర్ లో ఇదే రోజున పరంపూజ్య డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్ (డాక్టర్జీ) కేవలం ఐదుగురితో రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించాడు. ఈరోజుకి సరిగ్గా ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలను విశ్వమంతా జరుపుతుంది. 1991లో విశ్వహిందూ పరిషత్ దుర్గా వాహిని ని స్థాపించింది. మహిళలను అపరదుర్గలుగా తీర్చిదిద్దే సంస్థ ఇది. ఇలా విజయ దశమి పురాణ ఇతిహాస కాలము నుంచే కాకుండా ఆధునిక కాలంలో కూడా ఎన్నో విజయాలకు మూలమై ఎంతో  స్ఫూర్తిని ఇస్తున్నటువంటి ఉత్సవం. అందుకే  ఈ విజయ దశమిని అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకొని సనాతన హైందవ సంప్రదాయాన్ని సంపన్నం చేయాలి! భారతదేశాన్ని మరల గురు స్థానంలో నిలబెట్టాలి!

"సాహిత్య కళా విభూషణ"
 చౌడూరి నరసింహారావు
ప్రవచన కర్త, ఆధ్యాత్మిక విశ్లేషకులు

About The Author