జాతీయ లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి

- జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ 

WhatsApp Image 2025-11-11 at 5.32.09 PM

సంగారెడ్డి : 
:
రాజీమార్గమే - రాజా మార్గమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు.క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు.  జిల్లా వ్యాప్తంగా నమోదైన, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీపడేలా లోక్ అదాలత్ దోహదపడుతుందని, ఈ నెల 15 వ తేది వరకు జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు. రాజీ పడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు,  వైవాహిక జీవితం సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి కేసుల్లో ఇరువర్గాల సమ్మతితో రాజీకి కుదుర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. 

Read More పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడిగా బి. రాకేష్

సైబర్ నేరాలకు సంభందించి, బాధితులు కోల్పోయిన డబ్బులు త్వరగా భాదితులకు అందే విధంగా చూడాలని, 25 వేల రూపాయల కంటే తక్కువ డబ్బు కోల్పోయిన కేసులలో లోక్-అదాలత్ ద్వారా ఫిర్యాదు చేసుకొని, ఎఫ్ఐఆర్ లేకుండానే రీఫండ్ ప్రక్రియా చేసుకోవచ్చని అన్నారు. 

Read More నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా చూడాలి

జాతీయ లోక్ అదాలత్ విజయవంతం అయ్యేలా అధికారుల నుండి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరు భాద్యత యుతంగా వ్యవహరించి, రాజీ పడదగిన అన్ని కేసులలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీపడేలా చూడాలన్నారు. జాతీయ లోక్-అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం జరుగుతుందని అవగాహన కల్పించాలని అన్నారు. 

Read More రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2047 జూమ్ సమావేశం

About The Author