అంకితభావంతో పనిచేయాలి
- జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి :
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు,సిబ్బంది,
అనంతరం సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు జిల్లా కలెక్టర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు అందజేసి, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, జీవితంలో మంచి స్థానంలో నిలవాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అఖిలేష్ రెడ్డి, వసతి గృహ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
