మిర్చితోటను ధ్వంసం చేసిన దుండగులు

బోనకల్ మండలంలోని మోటమర్రికి చెందిన గుడిద వీరభద్రం అనే కౌలురైతు ఎకరం మిర్చి పంటను గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేశారు. ఓ మహిళ భూయజమాని దగ్గర భూమిని కౌలుకు తీసుకుని వీరభద్రం మిర్చి సాగుచేశాడు. కొడవళ్లతో పూర్తి ఎకరం మిర్చి పంటను నరికివేశారు. భూవివాదం ఉండటమే వంటను ధ్వంసం చేయడానికి కారణమని వీరభద్రం తెలిపాడు. సుమారు రూ.3లక్షల నష్టం వాటిల్లిందని కన్నీరుమున్నీరయ్యాడు. మిర్చి పంటను ధ్వంసం చేసిన దోషులను శిక్షించాలని సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ధ్వంసం చేసిన మిర్చి పంటను సిపిఐ జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్ కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ.. భూమి పట్టాదారునిపై, కౌలుదారునిపై వ్యక్తిగత కక్షను పెట్టుకొని గ్రామానికి చెందిన కొందరు ఈ ఘాతకానికి ఒడిగట్టారని ఆరోపించారు. పచ్చని పల్లెలో ఈ రకమైన సంస్కృతి మంచిది కాదని, రాజకీయనాయకులు ఈ రకమైన చర్యలకు ప్రత్యేక్షంగానీ, పరోక్షంగానీ దూరంగా ఉండాలని సూచించారు. కౌలురైతుకు రూ.3లక్షలపైగా నష్టం వాటిల్లిందని, పోలీసు అధికారులు వీరభద్రంకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలబోయిన రాము, వంగాల కృష్ణ, కౌలురైతు వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

మిర్చితోటను ధ్వంసం చేసిన దుండగులు

బోనకల్ మండలంలోని మోటమర్రికి చెందిన గుడిద వీరభద్రం అనే కౌలురైతు ఎకరం మిర్చి పంటను గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేశారు. ఓ మహిళ భూయజమాని దగ్గర భూమిని కౌలుకు తీసుకుని వీరభద్రం మిర్చి సాగుచేశాడు. కొడవళ్లతో పూర్తి ఎకరం మిర్చి పంటను నరికివేశారు. భూవివాదం ఉండటమే వంటను ధ్వంసం చేయడానికి కారణమని వీరభద్రం తెలిపాడు. సుమారు రూ.3లక్షల నష్టం వాటిల్లిందని కన్నీరుమున్నీరయ్యాడు.

మిర్చి పంటను ధ్వంసం చేసిన దోషులను శిక్షించాలని సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ధ్వంసం చేసిన మిర్చి పంటను సిపిఐ జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్ కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ.. భూమి పట్టాదారునిపై, కౌలుదారునిపై వ్యక్తిగత కక్షను పెట్టుకొని గ్రామానికి చెందిన కొందరు ఈ ఘాతకానికి ఒడిగట్టారని ఆరోపించారు. పచ్చని పల్లెలో ఈ రకమైన సంస్కృతి మంచిది కాదని, రాజకీయనాయకులు ఈ రకమైన చర్యలకు ప్రత్యేక్షంగానీ, పరోక్షంగానీ దూరంగా ఉండాలని సూచించారు. కౌలురైతుకు రూ.3లక్షలపైగా నష్టం వాటిల్లిందని, పోలీసు అధికారులు వీరభద్రంకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలబోయిన రాము, వంగాల కృష్ణ, కౌలురైతు వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts