డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించండి..
సీఎంసీ కమిషనర్ సృజన ను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు:
అమీన్పూర్ సర్కిల్, పటాన్చెరు సర్కిల్ పరిధిలోని తొమ్మిది డివిజన్ల సమగ్ర అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడంతో పాటు.. తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలు జిహెచ్ఎంసిలో విలీనమయ్యే సమయంలో గల 250 కోట్ల రూపాయల మిగులు నిధులను సైతం డివిజన్ల అభివృద్ధికి మంజూరు చేయాలని సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.
మంగళవారం గచ్చిబౌలిలోని సిఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ సృజనతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.
జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమై పలు అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ శాఖల అధికారుల మధ్య సమన్వయం లోపిస్తుందని.. దీని మూలంగా అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతున్నాయని తెలిపారు. నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పరిష్కరించాలని సూచించారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలో వరద నీటి సమస్య పరిష్కారానికి ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని.. కాలువల నిర్మాణానికి 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయబోతున్నట్లు జోనల్ కమిషనర్ అమిత్.. ఎమ్మెల్యే జిఎంఆర్ కు తెలిపారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలో గల రేడియం రోడ్డు లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఉర్జిత్ విల్లాస్ సమీపంలో వరద నీటి సమస్య పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మినీ స్టేడియాల అభివృద్ధికి వెంటనే నిధులు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ శంకరయ్య, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.
.jpeg)
About The Author
04 Jun 2026
