
ఉమ్మడి వరంగల్ బ్యూరో :
హసన్ పర్తి మండలం నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి చందరాజు లావణ్య సంతోష్ మంగళవారం కార్యకర్తల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హాజరయ్యారు.ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంతో కలిసి గ్రామాల అభివృద్ధి చేసేటోళ్లను సర్పంచులుగా గెలిపించుకోండని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో హాసన్ పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ & ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ తంగేళ్ళ తిరుపతి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ నాయకులు పాల్గొన్నారు.