ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి..
హైదరాబాద్ :
- గోదాం లోపల పరిస్థితుల సమీక్ష..
- చుడీ బజార్ లోని గోదాముల పరీక్ష..

హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమీషనర్ ఆర్ వి కర్ణన్ శనివారం కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చుడి బజార్ లో ఉన్న ప్రధాన ఈవీఎం గోదామును పరిశీలించారు. జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నిక కోసం భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ పరిశీలన జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ గోదాం లోపల ఉన్న వస్తువుల నిల్వ ఉన్న భద్రతా , స్థితిగతులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.
Read More సదర్ ఉత్సవాల్లో జగ్గారెడ్డి సందడి
About The Author
12 Nov 2025
