జగ్గారెడ్డి ఆధ్వర్యంలో దసరా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు

సంగారెడ్డి :

WhatsApp Image 2025-10-01 at 8.26.19 PM

సంగారెడ్డి పట్టణంలో టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  జగ్గారెడ్డి నేతృత్వంలో నాలుగు దశాబ్దాలకు పైగా కన్నుల పండువగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.పట్టణమంతా పది రోజుల ముందు నుంచే విద్యుత్ ద్వీపాల వెలుగులు, రంగురంగుల కాంతులతో మెరిసిపోతుంది..  ఢీల్లీ రాంలీలా మైదానంలో జరిగే దసరా ఉత్సవాలను మైమరిపించే విధంగా,తెలంగాణలో అత్యంత వైభవంగా దసరా ఏర్పాట్లు జరుగుచున్నాయి.

సాయంత్రం నాలుగు గంటలకు  రామమందిరంలో భజన కార్యక్రమంతో దసరా వేడుకలు ప్రారంభం అవుతాయి.భజన పాటలు, భక్తి శ్రద్ధలతో గరుత్మంతుడు శావ ఊరేగింపు తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.రామమందిరం భక్త భజన మండలితో పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొననున్న జగ్గారెడ్డి పాల్గొంటారని తెలిపారు.

అనంతరం రామమందిరం నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు శావ ఊరేగింపు, అంబేద్కర్ స్టేడియంలో మిరుమిట్లు గొలిపే విద్యుత్ ద్వీపాల కాంతులతో దసరా సంబరాలు,కోట్ల రూపాయల సొంత ఖర్చుతో ఏర్పాట్లు చేశారని  జగ్గారెడ్డి వర్గీయులు తెలిపారు. అందులో ముఖ్యంగా ప్రముఖ సినీ నేపథ్య గాయనీ,గాయకులతో సంగీత విభావరి నిర్వహిస్తారని దసరా ఉత్సవాలను తిలకించేందుకు వేలాదిగా సంగారెడ్డి జిల్లా వాసులు తరలిరావాలని కోరారు. విజయదశమి రోజు దుర్గామాత,జమ్మి చెట్టుకు పూజా కార్యక్రమం, పాలపిట్ట దర్శనం ఉంటాయని, అనంతరం కళ్లు మిరుమిట్లు గొలిపే బానాసంచా అరగంటపాటు  ఆకాశంలో కనువిందు చేస్తాయని, ఆ తర్వాత రావణాసుర దహనంతో దసరా వేడుకలు ముగుస్తాయని అన్నారు.

About The Author