పటాన్చెరు లో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఘన సన్మాన సభ
మంత్రుల సమక్షంలో మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం
పటాన్చెరు :
పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా ఏర్పాటైన సందర్భంగా, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పటాన్చెరు మార్కెట్ ప్రాంగణంలో ఘనంగా సన్మాన సభ నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ, తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి , TGIIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి , ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ , మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, పాల్గొని మార్కెట్ కమిటీ నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
.jpeg)
