సైబరాబాద్ లో ఆపరేషన్ స్మైల్ – XII షురూ..

be49a9ef-969e-4b73-b055-62ea17cc58ff

హైదరాబాద్ :
  
సైబరాబాద్ పోలీసులు కమీషనరేట్లో శనివారం రోజున ఆపరేషన్ స్మైల్ – XII  సమీక్షా సమావేశం నిర్వహించామని విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం తెలిపారు.  

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో ఈ నెల జనవరి 1వ తేదీ నుంచి 30 వరకు ఆపరేషన్ స్మైల్ – XII  లో భాగంగా తప్పిపోయిన  చిన్నారులను గుర్తించడం, భిక్షాటన, చెత్త సేకరణ, బాల కార్మికులు, బాలల అక్రమ రవాణా, వెట్టి చాకిరీలో చిక్కుకున్న పిల్లలను గుర్తించి, రక్షించి వివిధ శాఖల సమన్వయంతో వారికి పునరావాసం కల్పించడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ ఆపరేషన్ కోసం 12 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ బృందంలోఒక సబ్-ఇన్‌స్పెక్టర్, నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు (వీరిలో ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్) ఉంటారన్నారు. తప్పిపోయిన పిల్లలు, వీధి బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులతో కలిపేందుకు “దర్పణ్ యాప్ ” ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తామన్నారు.      

ఈ  సమీక్ష సమావేశంలో విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం, ఏసీపీ ఎస్. కృష్ణ ప్రసాద్, రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ  ఛైర్మన్ కె. నరేందర్ రెడ్డి., మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ రాజా రెడ్డి., రంగారెడ్డి జిల్లా, బాల రక్ష భవన్, సహ సమన్వయకర్త, తిరుమలాదేవి., అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్, రాష్ట్ర సమన్వయకర్త, వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా సహాయ కార్మిక కమీషనర్ సత్యనారాయణ., మేడ్చల్ జిల్లా సహాయ కార్మిక కమీషనర్ లక్ష్మీపతి., రంగారెడ్డి జిల్లా, ఆరోగ్య అధికారి, అంబిక, రంగారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్  ప్రవీణ్ కుమార్, సంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు కె. విష్ణుమూర్తి., యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్ స్పెక్టర్  పి. యాదయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author