నేటి స్వాతంత్య్ర సంబురం, వెలకట్టలేని వీరుల పోరాటాల ఫలితం

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

  • ప్రజల సంక్షేమం, అభివృద్దే ధ్యేయం ప్రతి ఒక్క అధికారి పనిచేయాలి
  • కలెక్టర్ క్యాంపు, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన జిల్లా కలెక్టర్

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), ఆగష్టు 15:
వెలకట్టలేని వీరుల పోరాటాల ఫలితం ఎంతో మంది త్యాగాలతో స్వాతంత్ర్యం సాధించుకున్నామని, ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఖమ్మం జుబ్లీపురాలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు కలెక్టర్, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. 

అనంతరం జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి హోదాలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాగణంలోని గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ నేటి స్వాతంత్య్ర సంబురం వెలకట్టలేని వీరుల త్యాగాల రూపమని, అలుపెరుగని పోరాటాల ఫలితమని అన్నారు. బ్రిటీష్ కబంధ హస్తాల నుంచి దేశ విముక్తి కోసం అసువులు బాసిన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకొని వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో దీక్షా రైనా, డిప్యూటీ జడ్పీ సీఈవో నాగ పద్మజ, పీఆర్ ఎస్ఇ వెంకటరెడ్డి, పీఆర్ డిఇ మహేష్ బాబు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More పశువుల అక్రమ రవాణా అంతరాష్ట్ర ముఠా పట్టివేత.

About The Author