ప్రతిభా కళా సరస్వతి “రోహిణి
ఒక్కో అక్షరపు పదాలలో ఒక్కోటి అక్షరాలు సందేశాత్మకంగా, విపులంగా చుట్టూ జరిగే జరుగుతున్న సంఘటనలను తన రచనా నైపుణ్యంతో బాల్య దశ నుంచే మక్కువ పెంచుకొని ప్రముఖ రచనల పండితుల పుస్తకాలను అభ్యసించి..కళల రచనలపై మక్కువతో రచనలు తనదైన శైలిలో రాయడం ప్రారంభించి ఎన్నో పురష్కారాలను,బహుమతులను అందుకొని..ఎందరో పాఠక అభిమానులను ఏర్పర్చుకొని యువత వలె ఆమె రచనలను పరుగులు పెట్టిస్తూ..పదుగురికి చెరువచేస్తున్న రచయిత్రి “రోహిణి పంజారి” ప్రాముఖ్యతను మరొక్కసారి ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పించాం. నేపథ్యం: పేరు: రోహిణి వంజారి తల్లిదండ్రులు: అరిశా సత్యనారాయణ, ఆదిలక్షమ్మ పుట్టి పెరిగిన ఊరు: నెల్లూరు విద్యార్హతలు:B.Sc, B.Ed కుటుంబం: భర్త: కృష్ణ మూర్తి వంజారి, టీవీ, సినీ నటులు, కథా రచయిత కొడుకు: శ్రీనివాస చైతన్య కోడలు: సాయి సాహిత్య కూతురు: వైష్ణవీ వృత్తి: సైన్స్ టీచర్ గా 15ఏళ్ళపైన అనుభవం ప్రవృత్తి: కథా రచన ఇప్పటివరకు రాసిన కథలు:80 కవితలు: 70 అన్నీ ప్రచురితం అయినవే సమీక్షలు, వ్యాసాలు రాయటంలో కూడా అనుభవం ఉంది. మొదటి కవిత:”అభాగ్యుడు”, అచ్చయిన పత్రిక: ప్రముఖ పత్రిక 1991 సంవత్సరంలో ప్రచురణ. మొదటి కథ: సూపర్ టీచర్ సిండ్రోం అచ్చయిన పత్రిక: నవ్య 2016 సంవత్సరం. బాల్యదశ నుంచే రచనలపై మక్కువ:ఇంటిలో సాహితీ వాతావరణం లేకపోయినా,చిన్నప్పటి నుంచి కథల పుస్తకాలు ఆసక్తిగా చదివే అలవాటు కాలేజీ టైం కి వ్యసనంలా మారింది. కాలేజీ నుండి ఇంటికి వచ్చే సమయంలో ప్రతిరోజూ గాంధీ బొమ్మ బస్టాప్ కి సమీపంలో ఉండే “పద్మావతి మహిళా గ్రంథాలయం” లోనికి వెళ్ళి పుస్తకాలు చదివాకనే ఇంటికి వెళ్ళటం జరిగేది.ఆ గ్రంథాలయంలోనే గొప్ప వారి రచనలు చదివే అవకాశం కలిగింది. శ్రీ శ్రీ, గురజాడ,బుచ్చి బాబు,రావి శాస్త్రి,చలం,రంగనాయకమ్మ, యుద్ధన పూడి సులోచన రాణి, యండమూరి వీరేంద్రనాథ్ వంటి ప్రముఖుల రచనలు చదవటం మొదలుపెట్టేవారు.గొప్ప వారి రచనలు చదవటంతో పాటు, చుట్టూ ఉన్న పరిసరాలను, వ్యక్తులను, కళ్ళముందు జరిగే సంఘటనలను ఆసక్తిగా పరిశీలించటం మొదలైంది. కళ్ళముందు జరిగిన కొన్ని సంఘటనలు హృదయాన్ని కదిలించగా, మనసు ఆర్ద్రమై, ఇక రాయకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడ్డాక, నేను చూసిన, నన్ను కదిలించిన సంఘటనలను కథలుగా మలచటం జరిగింది. అక్షరం నాకు లక్షల విలువ చేసే గొప్ప పాఠకులను సంపాదించి పెట్టింది.కొన్ని ప్రత్యేక కథలకు బహుమతులు అందుకున్నారు.2023 మార్చి 12న నా తొలి కథల సంపుటి “నల్ల సూరీడు కథలు”,ఆవిష్కరణ జరిగింది.అతి త్వరలోనే నా రెండవ కథా సంపుటి “విజయ మహల్ సెంటర్ కథలు” పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించదల్చారు.ఇక కథల్లో గొప్ప సందేశాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, పాఠకులను తమ రచనల ద్వారా తప్పు దోవ పట్టించకుంటే చాలని బలంగా నమ్ముతూ ఎన్నో రచనలతో సందేశాత్మక రచనలతో ముందడుగు వేస్తూ రచనల కవియిత్రిగా పేరు పొంది ఎన్నో బహుమతులతో పాటు.. ఎన్నో పురష్కారాలను అందుకొంటూ..యువతి వలె ఆమెలోని జాలువారుతున్న ఒక్కో అక్షర పదాలు ఆణిముత్యంతో పాఠకులను ఏర్పర్చుకొని తక్కువ వ్యవధిలో కీర్తి గడించారు.ఆమె పరిచయాన్ని పత్రిక ద్వారా తెలిపి, పాఠకుల చెంతకు రచనలను చేర్చే పత్రికా సంపాదకులకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలని రచయిత్రి రోహిణి వంజారి పేర్కొన్నారు. ప్రతిభా అక్షర సరస్వతి “రోహిణి పంజారి”! “రో” జురోజుకు అక్షర పరిజ్ఞానంతో రో “హి” ణి రచనలపై మక్కువతో a “ణి” ముత్యం వలె రచనలు ప్ర “పం” చానికి చాటిచప్పేలా “జా” లుతున్న అక్షర లక్ష్మి సరస్వతి “రి” కార్డులకు-అవార్డులకు తీసిపోని విధంగా సందేశాత్మకంగా రచనలు రాస్తూ..ముందడుగు వేస్తూ ఎందరినో పాఠక దేవుళ్లను ఏర్పర్చుకొన్న ప్రతిభ కళా “రచయిత్రి రోహిణి పంజారి”.
ఒక్కో అక్షరపు పదాలలో ఒక్కోటి అక్షరాలు సందేశాత్మకంగా, విపులంగా చుట్టూ జరిగే జరుగుతున్న సంఘటనలను తన రచనా నైపుణ్యంతో బాల్య దశ నుంచే మక్కువ పెంచుకొని ప్రముఖ రచనల పండితుల పుస్తకాలను అభ్యసించి..కళల రచనలపై మక్కువతో రచనలు తనదైన శైలిలో రాయడం ప్రారంభించి ఎన్నో పురష్కారాలను,బహుమతులను అందుకొని..ఎందరో పాఠక అభిమానులను ఏర్పర్చుకొని యువత వలె ఆమె రచనలను పరుగులు పెట్టిస్తూ..పదుగురికి చెరువచేస్తున్న రచయిత్రి “రోహిణి పంజారి” ప్రాముఖ్యతను మరొక్కసారి ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పించాం.
నేపథ్యం:
పేరు: రోహిణి వంజారి
తల్లిదండ్రులు: అరిశా సత్యనారాయణ, ఆదిలక్షమ్మ
పుట్టి పెరిగిన ఊరు: నెల్లూరు
విద్యార్హతలు:B.Sc, B.Ed
కుటుంబం:
భర్త: కృష్ణ మూర్తి వంజారి, టీవీ, సినీ నటులు, కథా రచయిత
కొడుకు: శ్రీనివాస చైతన్య
కోడలు: సాయి సాహిత్య
కూతురు: వైష్ణవీ
వృత్తి: సైన్స్ టీచర్ గా 15ఏళ్ళపైన అనుభవం
ప్రవృత్తి: కథా రచన
ఇప్పటివరకు రాసిన కథలు:80
కవితలు: 70
అన్నీ ప్రచురితం అయినవే
సమీక్షలు, వ్యాసాలు రాయటంలో
కూడా అనుభవం ఉంది.
మొదటి కవిత:”అభాగ్యుడు”, అచ్చయిన పత్రిక: ప్రముఖ పత్రిక 1991 సంవత్సరంలో ప్రచురణ.
మొదటి కథ: సూపర్ టీచర్ సిండ్రోం
అచ్చయిన పత్రిక: నవ్య 2016 సంవత్సరం.
బాల్యదశ నుంచే రచనలపై మక్కువ:ఇంటిలో సాహితీ వాతావరణం లేకపోయినా,చిన్నప్పటి నుంచి కథల పుస్తకాలు ఆసక్తిగా చదివే అలవాటు కాలేజీ టైం కి వ్యసనంలా మారింది. కాలేజీ నుండి ఇంటికి వచ్చే సమయంలో ప్రతిరోజూ గాంధీ బొమ్మ బస్టాప్ కి సమీపంలో ఉండే “పద్మావతి మహిళా గ్రంథాలయం” లోనికి వెళ్ళి పుస్తకాలు చదివాకనే ఇంటికి వెళ్ళటం జరిగేది.ఆ గ్రంథాలయంలోనే గొప్ప వారి రచనలు చదివే అవకాశం కలిగింది. శ్రీ శ్రీ, గురజాడ,బుచ్చి బాబు,రావి శాస్త్రి,చలం,రంగనాయకమ్మ, యుద్ధన పూడి సులోచన రాణి, యండమూరి వీరేంద్రనాథ్ వంటి ప్రముఖుల రచనలు చదవటం మొదలుపెట్టేవారు.గొప్ప వారి రచనలు చదవటంతో పాటు, చుట్టూ ఉన్న పరిసరాలను, వ్యక్తులను, కళ్ళముందు జరిగే సంఘటనలను ఆసక్తిగా పరిశీలించటం మొదలైంది. కళ్ళముందు జరిగిన కొన్ని సంఘటనలు హృదయాన్ని కదిలించగా, మనసు ఆర్ద్రమై, ఇక రాయకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడ్డాక, నేను చూసిన, నన్ను కదిలించిన సంఘటనలను కథలుగా మలచటం జరిగింది. అక్షరం నాకు లక్షల విలువ చేసే గొప్ప పాఠకులను సంపాదించి పెట్టింది.కొన్ని ప్రత్యేక కథలకు బహుమతులు అందుకున్నారు.2023 మార్చి 12న నా తొలి కథల సంపుటి “నల్ల సూరీడు కథలు”,ఆవిష్కరణ జరిగింది.అతి త్వరలోనే నా రెండవ కథా సంపుటి “విజయ మహల్ సెంటర్ కథలు” పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించదల్చారు.ఇక కథల్లో గొప్ప సందేశాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, పాఠకులను తమ రచనల ద్వారా తప్పు దోవ పట్టించకుంటే చాలని బలంగా నమ్ముతూ ఎన్నో రచనలతో సందేశాత్మక రచనలతో ముందడుగు వేస్తూ రచనల కవియిత్రిగా పేరు పొంది ఎన్నో బహుమతులతో పాటు.. ఎన్నో పురష్కారాలను అందుకొంటూ..యువతి వలె ఆమెలోని జాలువారుతున్న ఒక్కో అక్షర పదాలు ఆణిముత్యంతో పాఠకులను ఏర్పర్చుకొని తక్కువ వ్యవధిలో కీర్తి గడించారు.ఆమె పరిచయాన్ని పత్రిక ద్వారా తెలిపి, పాఠకుల చెంతకు రచనలను చేర్చే పత్రికా సంపాదకులకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలని రచయిత్రి రోహిణి వంజారి పేర్కొన్నారు.
“రో” జురోజుకు అక్షర పరిజ్ఞానంతో రో
“హి” ణి రచనలపై మక్కువతో a
“ణి” ముత్యం వలె రచనలు ప్ర
“పం” చానికి చాటిచప్పేలా
“జా” లుతున్న అక్షర లక్ష్మి సరస్వతి
“రి” కార్డులకు-అవార్డులకు తీసిపోని
విధంగా సందేశాత్మకంగా రచనలు రాస్తూ..ముందడుగు వేస్తూ ఎందరినో పాఠక దేవుళ్లను ఏర్పర్చుకొన్న ప్రతిభ కళా “రచయిత్రి రోహిణి పంజారి”.
