టీఎస్‌ఆర్టీసీలో మరోసారి ఛార్జీల బాదుడు.. డీజిల్ సెస్ భారీగా పెంపు

తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి భారం పడనుంది. డీజిల్‌ సెస్‌ విధించేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్టీసీ (TSRTC) ఛార్జీలు మరోసారి పెరిగాయి. పెరిగిన ధరలు రేపటి నుంచే (జూన్ 9) అమల్లోకి వస్తాయని టీఎస్‌ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. దూరాన్ని బట్టి డీజిల్ సెస్ విధించనున్నారు. రేపటి నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో అదన‌పు డీజిల్ సెస్ వసూలు చేయనున్నారు. ప‌ల్లె వెలుగు బస్సుల్లో 250 కి.మీ. దూరానికి ప్రస్తుతం ఈ సెస్ (Diesel Cess) రూ.5 ఉండగా.. దీన్ని రూ.45కు పెంచినట్లు తెలుస్తోంది. ఎక్స్ ప్రెస్‌ బస్సుల్లో 500 కి.మీ. దూరానికి ఈ సెస్ రూ.5 నుంచి రూ.90కి పెంచారు. డీల‌క్స్‌ బస్సుల్లో 500 కి.మీ దూరానికి రూ.5 నుంచి రూ.125కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక సూప‌ర్ ల‌గ్జరీ బస్సుల్లో 500 కి.మీ దూరానికి డీజిల్ సెస్ రూ.10 నుంచి రూ.130కి పెంచారు. ఏసీ స‌ర్వీసుల్లో 500 కి.మీ. దూరానికి రూ.10 నుంచి రూ.170కి పెంచారు. ఇంధన ధరలు భారీగా పెరిగిన కారణంగా డీజిల్ సెస్ పెంచుతున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం డీజిల్ సెస్ పెంపులేదని టీఎస్‌ఆర్టీసీ వర్గాలు స్పష్టం చేశాయి. గ్రేటర్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇది కాస్త ఊరటనిచ్చే అంశం. గతంలో రౌండప్‌ ధరలు (చిల్లర ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు), టోల్‌ ప్లాజాలు, ప్యాసింజర్స్‌ సెస్‌ పేరుతో TSRTC ఒకసారి ఛార్జీలు పెంచింది. గత ఏప్రిల్‌లో డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రయాణికులపై మరోసారి భారం మోపింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి డీజిల్‌ సెస్‌ కింద 2 రూపాయలు; ఎక్స్‌ ప్రెస్, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌, ఏసీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.5 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేస్తున్నారు. తాజాగా ఈ మొత్తాన్ని మరోసారి పెంచారు. డీజిల్ సెస్ ఇలా.. ★ ప‌ల్లె వెలుగు: 250 కి.మీ దూరానికి రూ.5 నుంచి 45 రూపాయల పెంపు. ★ ఎక్స్ ప్రెస్‌: 500 కి.మీ. వరకు దూరానికి రూ.5 నుంచి రూ.90. ★ డీల‌క్స్‌: 500 కి.మీ. వరకు దూరానికి రూ.5 నుంచి రూ.125. ★ సూప‌ర్ ల‌గ్జరీ: 500 కి.మీ. దూరం వరకు రూ.10 నుంచి రూ.130 పెంపు. ★ ఏసీ స‌ర్వీసులు: 500 కి.మీ. వరకు రూ.10 నుంచి రూ.170కి పెంపు.

టీఎస్‌ఆర్టీసీలో మరోసారి ఛార్జీల బాదుడు.. డీజిల్ సెస్ భారీగా పెంపు

తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి భారం పడనుంది. డీజిల్‌ సెస్‌ విధించేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్టీసీ (TSRTC) ఛార్జీలు మరోసారి పెరిగాయి. పెరిగిన ధరలు రేపటి నుంచే (జూన్ 9) అమల్లోకి వస్తాయని టీఎస్‌ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. దూరాన్ని బట్టి డీజిల్ సెస్ విధించనున్నారు. రేపటి నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో అదన‌పు డీజిల్ సెస్ వసూలు చేయనున్నారు. ప‌ల్లె వెలుగు బస్సుల్లో 250 కి.మీ. దూరానికి ప్రస్తుతం ఈ సెస్ (Diesel Cess) రూ.5 ఉండగా.. దీన్ని రూ.45కు పెంచినట్లు తెలుస్తోంది. ఎక్స్ ప్రెస్‌ బస్సుల్లో 500 కి.మీ. దూరానికి ఈ సెస్ రూ.5 నుంచి రూ.90కి పెంచారు. డీల‌క్స్‌ బస్సుల్లో 500 కి.మీ దూరానికి రూ.5 నుంచి రూ.125కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక సూప‌ర్ ల‌గ్జరీ బస్సుల్లో 500 కి.మీ దూరానికి డీజిల్ సెస్ రూ.10 నుంచి రూ.130కి పెంచారు. ఏసీ స‌ర్వీసుల్లో 500 కి.మీ. దూరానికి రూ.10 నుంచి రూ.170కి పెంచారు.

ఇంధన ధరలు భారీగా పెరిగిన కారణంగా డీజిల్ సెస్ పెంచుతున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం డీజిల్ సెస్ పెంపులేదని టీఎస్‌ఆర్టీసీ వర్గాలు స్పష్టం చేశాయి. గ్రేటర్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇది కాస్త ఊరటనిచ్చే అంశం.

గతంలో రౌండప్‌ ధరలు (చిల్లర ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు), టోల్‌ ప్లాజాలు, ప్యాసింజర్స్‌ సెస్‌ పేరుతో TSRTC ఒకసారి ఛార్జీలు పెంచింది. గత ఏప్రిల్‌లో డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రయాణికులపై మరోసారి భారం మోపింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి డీజిల్‌ సెస్‌ కింద 2 రూపాయలు; ఎక్స్‌ ప్రెస్, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌, ఏసీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.5 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేస్తున్నారు. తాజాగా ఈ మొత్తాన్ని మరోసారి పెంచారు.

డీజిల్ సెస్ ఇలా..
★ ప‌ల్లె వెలుగు: 250 కి.మీ దూరానికి రూ.5 నుంచి 45 రూపాయల పెంపు.
★ ఎక్స్ ప్రెస్‌: 500 కి.మీ. వరకు దూరానికి రూ.5 నుంచి రూ.90.
★ డీల‌క్స్‌: 500 కి.మీ. వరకు దూరానికి రూ.5 నుంచి రూ.125.
★ సూప‌ర్ ల‌గ్జరీ: 500 కి.మీ. దూరం వరకు రూ.10 నుంచి రూ.130 పెంపు.
★ ఏసీ స‌ర్వీసులు: 500 కి.మీ. వరకు రూ.10 నుంచి రూ.170కి పెంపు.

About The Author

Related Posts