కట్టర్ బీజేపీ కార్యకర్తలు... కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

స్థానిక నేతల అహంకార ధోరణి...పార్టీ మారిన బీజేపీ నాయకులు

కట్టర్ బీజేపీ కార్యకర్తలు... కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

ఎల్బీనగర్:

మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణపురం డివిజన్ లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లుగా భావించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందు వెళుతున్న సదర్భంగా ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి ఇరువురి ఆధ్వర్యంలో, మాజీ శాసన సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కిచ్చేన్నగారి లక్ష్మారెడ్డి టీపీసీసీ ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ ఆర్కే పురం డివిజన్ ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్, మాజీ వార్డ్ సభ్యుడు గుణగంటి రమేష్ గౌడ్, ఎన్టీఆర్ నగర్ ఫేజ్ -II అధ్యక్షుడు కర్రే రవి లకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి హృదయ పూర్వకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సామాన్యుడికి అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ వైపు వస్తున్నారని పేర్కొన్నారు.
బీజేపీ నాయకత్వంపై నమ్మకం కోల్పోయి, బీజేపీ నేతల అహంకార ధోరణి తట్టుకోలేక, ఎన్నెండ్లు కష్టపడ్డా ఎదుగుదల లేక, విసిగిపోయి ఆ పార్టీలోని క్రియాశీలక నాయకులు బయటకు వస్తున్నారని, రాబోయే రోజుల్లో మహేశ్వరంలో బీజేపీ నామరూపాలు లేకుండా పోతుందని వారు విమర్శించారు. పార్టీలో చేరిన వారికి సరైన గుర్తింపునిస్తామని, ప్రతీ కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. అందరం కలిసికట్టుగా పనిచేసి మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి లింగస్వామి గౌడ్, బొడ్డుపల్లి మహేందర్, పగడాల ఎల్లయ్య, రాజు నాయక్, వెంకటేశ్వర్లు, జ్ఞానేశ్వర్ యాదవ్,దుబ్బాక శేఖర్,యాదవ రెడ్డి,అక్బర్, శేఖర్ ముదిరాజ్,అల్లేటి కిరణ్, మహమ్మద్, భూపాల్ రెడ్డి, షఫీ, పాషా పటేల్, నబీ, సమ్మద్, రేణుక, మాధవి, ఈశ్వరమ్మ, పార్వతమ్మ, లావణ్య, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

About The Author