మూడోసారి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అంబటి బాలేష్ గౌడ్ నియామకం

మూడోసారి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అంబటి బాలేష్ గౌడ్ నియామకం

సిద్దిపేట:


బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా దుబ్బాక కు చెందిన అంబటి బాలేష్ గౌడ్ ను మరోసారి నియమిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు.బాలేష్ గౌడ్ ను రాష్ట్ర పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించడం ఇది మూడోసారి. గతంలో బండి సంజయ్ , తర్వాత కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సమయంలో కూడా రెండు సార్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పని చేసారు. ప్రస్తుత బిజెపి రాష్ట్రఅధ్యక్షులు రామ్ చందర్ రావ్  కూడా మరోసారి కార్యవర్గ సభ్యులుగా నియమించారు.WhatsApp Image 2026-03-31 at 19.49.49

ఆర్ఎస్ఎస్ నుండి ఏబీవీపీ లో చురుగ్గా....

చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ లలో చురుకుగా పనిచేసిన బాలేష్ గౌడ్ పార్టీ లో అంచెలంచలుగా ఎదుగుతూ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్థాయికి చేరుకున్నారు. 2000 సంవత్సరంలో బిజెపి దుబ్బాక పట్టణ అధ్యక్షులుగా పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి మండల బీజేవైఎం అధ్యక్షులు గా, బిజెపి దుబ్బాక నియోజకవర్గ ప్రచార కార్యదర్శి గా, బిజెపి దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్ గా రెండు సార్లు పని చేశారు. తర్వాత బిజెపి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెండు సార్లు, తర్వాత జిల్లాల విభజన అనంతరం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గా పని చేశారు. అనంతరం రెండుసార్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా పని చేసిన బాలేష్ గౌడ్ ను మళ్ళీ మూడోసారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారు.

26 ఏళ్లుగా పార్టీలో బాధ్యతలు... 

గత 26 సంవత్సరాల నుండి పార్టీలో భాద్యతలు లేకుండా ఏనాడూ కూడా లేరు. బాలేష్ గౌడ్ ను రాష్ట్ర పార్టీ గతంలో హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలకు ఇంచార్జిగా నెలల రోజుల పాటు పంపించింది. తర్వాత నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కూడా పని చేశారు. గత సంవత్సరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు వేములవాడ నియోజకవర్గానికి ఇంచార్జి గా పని చేసారు. పార్టీ అప్పగించిన పనిని శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తారని స్వంత పార్టీలోనే 
బాలేష్ గౌడ్ కు మంచి పేరుంది. 

శక్తి వంచనలేకుండా కృషి చేస్తా 

- మూడోసారి నియమించడం సంతోషకరం 
- పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు 
- రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ 

తనపై నమ్మకంతో మూడోసారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావ్ నియమించడం పట్ల  అంబటి బాలేష్ గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడతానని తెలిపారు.రాబోయే 2028 ఎన్నికలలో తెలంగాణా రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని అన్నారు. తనని నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావ్ కి ఈ సందర్బంగా తాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

About The Author