డ్రైవర్ల చూపుపై 'మల్కాజ్గిరి కమిషనరేట్' నిఘా!
- అరైవ్ అలైవ్'లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం
- 76 మందికి పరీక్షలు.. 8ఎనిమిది మందికి శుక్లాలు గుర్తింపు
చెర్లపల్లి:
రహదారి భద్రతే లక్ష్యంగా, వాహన చోదకుల ఆరోగ్య సంరక్షణ కోసం మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కీలక ముందడుగు వేసింది. 'అరైవ్ అలైవ్' (Arrive Alive) మూడో దశ కార్యక్రమంలో భాగంగా, మల్కాజ్గిరి సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో సోమవారం చెర్లపల్లిలోని హెచ్పీసీఎల్ (HPCL) ప్రాంగణంలో భారీ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
లోపాలు ఉంటే ప్రమాదమే..
రహదారిపై వాహనం నడిపే వ్యక్తికి కంటి చూపు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో మొత్తం 76 మంది భారీ వాహన (HMV) డ్రైవర్లకు నిపుణులైన వైద్యులతో పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
31 మందికి దృష్టి లోపం ఉండటంతో కళ్లద్దాలు వాడాలని వైద్యులు సూచించారు..jpeg)
ఒక డ్రైవర్కు కేవలం ఒక్క కన్ను మాత్రమే పని చేస్తున్నట్లు నిర్ధారించారు.
ఇలాంటి సమస్యలతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
సమిష్టి కృషితో భద్రత:
మల్కాజ్గిరి సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి శ్రీమతి సావిత్రి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతా విభాగం డీసీపీ, ప్లాంట్ ఇన్ఛార్జ్ సురేష్, సేఫ్టీ మేనేజర్ ప్రవీణ్, చెర్లపల్లి లా అండ్ ఆర్డర్ సీఐ తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు, ముఖ్యంగా నిరంతరం రోడ్లపై ఉండే డ్రైవర్ల ఆరోగ్యం పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు.
నివారణే మేలు..
కేవలం జరిమానాలు విధించడమే కాకుండా, డ్రైవర్లలో అవగాహన కల్పించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో ఇటువంటి శిబిరాలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.
