బీడీ కార్మికుల శ్రమ దోపిడీ అరికట్టాలి : కామారెడ్డి సిపిఐ ఎంఎల్

కామారెడ్డి జిల్లా :
బీడీ కార్మికుల వద్ద నుండి వెయ్యి బీడీలకు అదనంగా రూ.10 వసూలు చేసే పద్ధతికి బలవంతంగా తినుబండారాల వ్యాపారానికి స్వస్తి పలకాలి, సరిపడా మంచి తునికాకు ఇవ్వాలి, ఆర్. రమేష్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డిమాండ్,
వీటితో పాటు బీడీ యజమాన్యం తినుబండారాలైన కురుకురే దీపావళి పండుగ సందర్భంగా స్వీట్లు. కారా పాకెట్లు తప్పనిసరి కొనుగోలు చేసే విధంగా బలవంతంగా అంటకట్టే పద్ధతి సమంజసం కాదని ఈ పద్ధతి గత పది సంవత్సరాలుగా కొనసాగుతుందని కోట్లాది రూపాయలు కార్మికులకు నష్టం చేస్తున్నారని అన్నారు..
అనేకసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి కార్మికుల నష్టపరిచే ఈ పద్ధతుల్ని మానుకోవాలని కోరిన ఫలితం లేకపోవడంతో రేపు అనగా 27అక్టోబర్ రోజున డివిజన్ ఆఫీసు కామారెడ్డికి వెళ్లి డిమాండ్ చేస్తామని అన్నారు. దీనికి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. మీడియా మిత్రుల సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు సత్తెమ్మ, ఎ. ప్రకాష్, జిల్లా నాయకులు,జి.అరవింద్, జిల్లా నాయకులు గోపాల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
16 Apr 2026
