రేషన్ 'పరేషాన్'.. సిటీలో లబ్ధిదారుల అవస్థలు!
- మూడు నెలల కోటా ఒక్కసారిగా పంపిణీ.. ఆటో ఛార్జీల మోత
- గోధుమల మాయాజాలం.. కిలోకు రూ. 16 వసూలు చేస్తున్న డీలర్లు
*హైదరాబాద్ :
బంగారు తెలంగాణలో రేషన్ కష్టాలు.. పట్టణ ప్రాంతాల్లో రేషన్ పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించడంతో లబ్ధిదారులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఒకేసారి భారీ మొత్తంలో సరుకులు వస్తుండటంతో వాటిని ఇంటికి తీసుకెళ్లడానికి కూలీలు, ఆటో ఛార్జీల రూపంలో రూ. 200 నుంచి రూ. 300 వరకు అదనపు భారం పడుతోందని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. పని మానుకుని గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నా.. చివరకు డీలర్ల చేతివాటంతో సరుకులు తక్కువగా వస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
గోధుమల పంపిణీలో ‘డీలర్ల’ దందా
తూకంలో మాయ.. బోర్డులు మాయం!
ఎండలో ‘వడ’దెబ్బ.. కనీస సౌకర్యాలు శూన్యం
మండిపోతున్న ఎండల్లో వృద్ధులు, మహిళలు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంతో లబ్ధిదారులు అస్వస్థతకు గురవుతున్నారు.
> "కూలి పని వదులుకుని వస్తే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఆటో కిరాయిలకే సగం డబ్బులు పోతున్నాయి. అధికారులు స్పందించి ధరల పట్టికలు ఏర్పాటు చేయించాలి. అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలి."
> *—కొండల్ .వేముల*
>
ఇకనైనా పౌరసరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పంపిణీ తీరును పర్యవేక్షించాలని, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
